ETV Bharat / state

ములుగు ఆదివాసులకు తప్పని తిప్పలు

అడవితో ఆదివాసుల అనుబంధం విడదీయరానిది. పుట్టుక నుంచి చనిపోయే దాకా అడవి తల్లితో మమేకమై ఆనందంగా గడుపుతారు. పూలు, పండ్లు, ఆకులు ఏరుకొని జీవనం సాగిస్తారు తప్ప నగరం వైపు రారు. ఒకవేళ రావాల్సి వచ్చినా... ఇక్కడి ప్రజలతో కలిసిపోలేరు.

author img

By

Published : Mar 28, 2019, 2:39 PM IST

ములుగు ఆదివాసులకు తప్పని ముప్పుతిప్పలు
ములుగు ఆదివాసులకు తప్పని ముప్పుతిప్పలు
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపురం, వాజేడు మండలాల్లో 16 ఏళ్లుగా గుత్తి కోయలు జీవనం సాగిస్తున్నారు. వీరంతా ఎన్నో ఏళ్ల క్రితమే ఛత్తీస్​గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వలస వచ్చారు. వసంత రుతువు నుంచి శిశిర రుతువు వరకు విప్ప పూలు, అనంతరం తునికాకు, అప్పుడప్పుడూ పండ్లు, పూలు సేకరించి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

సర్కారు కరుణించడం లేదు

అడవి బిడ్డలైన ఆదివాసులను సర్కారు కరుణించడం లేదు. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు ఇప్పించిన ప్రభుత్వం కనీస సౌకర్యాలు మాత్రం కల్పించట్లేదు. అంతేకాదు అడవిపైనే ఆధారపడి జీవిస్తున్న వీరిని అడవి వదిలి వెళ్లిపోవాలంటూ ఇబ్బంది పెడ్తున్నారు అటవీశాఖ అధికారులు. పోడు వ్యవసాయం నివారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఎన్నికలు వస్తే చాలు పోలీసులు పొద్దున నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్​లో ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.

పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన తమకు తెలుగు భాష రాక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. మాతో ఓట్లు వేయించుకుంటున్నారు కానీ కనీస సౌకర్యాలు కల్పించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగేందుకు మంచినీరు లేక అడవిలో చెలమల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేక కష్టాలు పడుతున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ కష్టాలు తీర్చాలని అడవి బిడ్డలు కోరుతున్నారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు వేధించకుండా చూడాలని గుత్తికోయ గిరిజనులు వేడుకుంటున్నారు. పక్క రాష్ట్రంలో బతకలేక ఇక్కడకు వస్తే తమతో ఇలా వ్యవహరించడం సరికాదని చెబుతున్నారు.

ఇవీ చదవండి:సీఎల్పీ విలీనం కోసం తెరాస వ్యూహరచన

ములుగు ఆదివాసులకు తప్పని ముప్పుతిప్పలు
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపురం, వాజేడు మండలాల్లో 16 ఏళ్లుగా గుత్తి కోయలు జీవనం సాగిస్తున్నారు. వీరంతా ఎన్నో ఏళ్ల క్రితమే ఛత్తీస్​గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వలస వచ్చారు. వసంత రుతువు నుంచి శిశిర రుతువు వరకు విప్ప పూలు, అనంతరం తునికాకు, అప్పుడప్పుడూ పండ్లు, పూలు సేకరించి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

సర్కారు కరుణించడం లేదు

అడవి బిడ్డలైన ఆదివాసులను సర్కారు కరుణించడం లేదు. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు ఇప్పించిన ప్రభుత్వం కనీస సౌకర్యాలు మాత్రం కల్పించట్లేదు. అంతేకాదు అడవిపైనే ఆధారపడి జీవిస్తున్న వీరిని అడవి వదిలి వెళ్లిపోవాలంటూ ఇబ్బంది పెడ్తున్నారు అటవీశాఖ అధికారులు. పోడు వ్యవసాయం నివారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఎన్నికలు వస్తే చాలు పోలీసులు పొద్దున నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్​లో ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.

పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన తమకు తెలుగు భాష రాక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. మాతో ఓట్లు వేయించుకుంటున్నారు కానీ కనీస సౌకర్యాలు కల్పించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగేందుకు మంచినీరు లేక అడవిలో చెలమల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేక కష్టాలు పడుతున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ కష్టాలు తీర్చాలని అడవి బిడ్డలు కోరుతున్నారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు వేధించకుండా చూడాలని గుత్తికోయ గిరిజనులు వేడుకుంటున్నారు. పక్క రాష్ట్రంలో బతకలేక ఇక్కడకు వస్తే తమతో ఇలా వ్యవహరించడం సరికాదని చెబుతున్నారు.

ఇవీ చదవండి:సీఎల్పీ విలీనం కోసం తెరాస వ్యూహరచన

Intro:tg_wgl_52_28_avasthalu_paduthunna_girijanulu_pkg_c7_SD
G RAJU MULUGU CONTRIBUTER

యాంకర్ : అడవితో ఆదివాసుల బంధం విడదీయరానిది. నిత్యం అడవితో మమేకమై ఆధారపడి జీవిస్తున్న అడవి బిడ్డలకు అడవి ప్రాణం. జీవించడం కోసం, ఈ అందమైన అడవిలోనే ఆదివాసుల తమ జీవితాన్ని వెతుక్కుంటారు. పచ్చని అడవి లో విప్ప పూల కోసం ఆదివాసుల వెతుకులాట శ్రమైక అందరి అని తలపిస్తుంది.


Body:వాయిస్ : వసంత రుతువు మొదలుకొని శిశిర రుతువు వరకు విప్ప పూల సోయగంతో అడవి తల్లి పరవశించి పోతుంది. తన చల్లని నీడలో బ్రతుకును వెళ్లదీస్తున్న ఆదివాసులకు ఇప్పపూలను అందిస్తూ అక్కున చేర్చుకుంటుంది. చెట్ల చల్లని నీడలో ఆదివాసుల ఇప్పపూల సేకరణ మొదలు పెట్టారు. బలవర్ధకమైన ఆహారంగా ఆదివాసులు భావించే ఈ పూలు వేసవి కాలంలో వీరికి మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. ఇప్ప పూలతో సారా, కుడుములు తయారు చేసుకుంటారు. దీపపు సేకరణ తర్వాత ఇప్ప కాయలు వేరి ఎండబెట్టి వంట నూనె తయారు చేసుకుంటారు. వేసవి కాలంలోనే ఈ సేకరణను మీరు పూర్తి చేసుకుంటారు. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపురం, వాజేడు మండలం లో గుత్తి కోయ గిరిజనులు చత్తీస్గడ్ ఒరిస్సా రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ఆదివాసులు 16 సంవత్సరాల క్రితం నుండి ఈ ప్రాంతాలలో నివసిస్తున్నారు. వీరిని ఆడది తల్లి ఆదుకుంటున్న సర్కారు మాత్రం కరుణించడం లేదు ఏళ్ల తరబడి కనీస సౌకర్యాలు లేకుండా వీరు జీవనం కొనసాగిస్తున్నారు. వీరిని సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జీవిస్తూ ఆధార్ కార్డు ఓటరు కార్డులు కలిగిన వీరిని గుర్తించడం లేదు. అడవిలోని జీవిస్తూ అడవిపైనే ఆధారపడి ఉన్న వీరిని అడవి శాఖ అధికారులు అడవిని వదల మంటున్నారు. పోడు వ్యవసాయం తో అడవిని నాశనం చేస్తున్నారు అంటూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అటవీశాఖ అధికారుల ల గ్రామంలో జీవితం అనుకుంటే కొందరు గ్రామస్తులు మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు అంటున్నారు. ఈ గుత్తి కోట గిరిజనులకు తెలుగు భాష వచ్చి, రాక నానా ఇబ్బందులు పడుతుంటారు. మరోవైపు పోలీసులు సైతం తమను వేధిస్తున్నారని, ఎన్నికలు వస్తే చాలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచి వేధిస్తున్నారని అన్నారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారని నేపంతో తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రంలో బతకలేక ఇక్కడకు వస్తే ఇలా వ్యవహరించడం సరికాదన్నారు ఇకనైనా సర్కారు తమను పట్టించుకోవాలని కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న నా ఓట్లు వేయించుకుంటారు కానీ మాకు కనీస సౌకర్యాలు ప్రభుత్వం కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు .త్రాగు నీరు లేక అడవి ఒరే నుంచి వచ్చే నీరుని చెలమల ద్వారా తీసుకొని సేవిస్తున్నారు. తాగునీరు కోసం బోరు బావి వేస్తే బాగుంటుందని, విద్యుత్ సౌకర్యం లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, పోలీసులు, అటవీశాఖ అధికారులు వేధించకుండా చూడాలని గుత్తి కోయ గిరిజనులు వేడుకుంటున్నారు.



Conclusion:బైట్స్ 1: సుని గొత్తికోయ గిరిజన మహిళ
2 : గంగయ్య గొత్తికోయ గిరిజనుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.