ETV Bharat / state

నత్తేనయం: పురోగతి లేని వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు

author img

By

Published : Jul 2, 2020, 12:38 PM IST

ములుగు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఉపాధి హామీ పథకం నుంచి రావాల్సిన బిల్లులు చెల్లించడంలో అధికారులు జాప్యం చేయడం వల్ల పనులు సాగడం లేదు. మిషన్‌తో పనిచేసేందుకు అవకాశం ఉన్న డంపింగ్‌ యార్డుల పనులను వేగంగా పూర్తిచేసిన అధికారులు వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్నారు.

Neglegency in development works in mulugu district
పురోగతి లేని వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు

ములుగు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల వేగంలో నత్తే నయం అనిపిస్తోంది. మౌలిక వసతుల లోపంతో ప్రజలు ఇబ్బందులు ఏర్పడకూడదనే ఉద్దేశంతో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. ఉపాధి హామీ పథకం నుంచి రావాల్సిన బిల్లులను చెల్లించడంలో అధికారులు చేస్తున్న జాప్యంతో పనులు ముందుకు సాగడంలేదు. జిల్లాలోని 174 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామం, సెగ్రిగేషన్‌ షెడ్లు, డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

వీటికి ఉపాధిహామీ పథకం ద్వారా సుమారు రూ.28.71 కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో వైకుంఠధామానికి రూ.12 లక్షలు, సెగ్రిగేషన్‌ షెడ్డుకు రూ.2.50 లక్షలు , డంపింగ్‌ యార్డుకు రూ.2 లక్షలు ఖర్చుచేయాలి. తడి, పొడి చెత్తను వేరుచేసి కంపోస్టు ఎరువును తయారు చేసే సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణానికి వర్షాకాలం సమీపించినా అధికారులు మార్కింగ్‌లు ఇవ్వడంలోనే ఉన్నారు. కలెక్టర్‌ మందలించినా అధికారులు, ప్రజాప్రతినిధులు, గుత్తేదారులలో కదలిక లేకపోతోంది. మిషన్‌తో పనిచేసేందుకు అవకాశం ఉన్న డంపింగ్‌ యార్డుల పనులను వేగంగా పూర్తిచేసిన అధికారులు వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్నారు.

బిల్లుల జాప్యంతో లెంటల్‌ స్థాయిలోనే నిలిచిపోయిన టేకులగూడెం వైకుంఠధామం

భూసమస్యతో కొన్ని.. లాక్‌డౌన్‌ సాకుతో మరికొన్ని..

వెంకటాపూర్‌ మండలంలో డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి మూడు గ్రామపంచాయతీలలో భూ సమస్య ఏర్పడింది. ములుగు మండలంలో తొమ్మిది, ఏటూరునాగారం మండలంలో మూడు, వాజేడు మండలంలో దూలాపురం, గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీల్లో వైకుంఠధామం పనులు ప్రారంభం కాలేదు. కొంగాల వైకుంఠధామానికి చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని వర్షం పేరుతో మధ్యలోనే నిలిపేశారు.

ఆలస్యంగా చెల్లింపులు..

వైకుంఠధామాలను నిర్మిస్తున్న గుత్తేదారులకు బిల్లులను చెల్లించడంలో ఏర్పడిన ఆలస్యంతో పనులలో వేగం లోపించింది. వైకుంఠధామాలను నిర్మించేందుకు ఇప్పటికే సుమారు రూ.6 నుంచి రూ.8లక్షల అప్పులుచేసి పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు కేవలం రూ.1.06లక్షలను మాత్రమే చెల్లించడంతో తలలు పట్టుకుంటున్నారు. వాజేడు మండలంలోని కొంగాల, నాగారం, టేకులగూడెం వైకుంఠధామాలు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పీఆర్‌ శాఖ నుంచి చేపట్టిన నిర్మాణాలకు ఇప్పుడిప్పుడే మార్కింగ్‌ ఇస్తున్నారు.

బిల్లుల జాప్యంతో అసంపూర్తిగా కొంగాల గ్రామ పంచాయతీ వైకుంఠధామం

సెగ్రిగేషన్‌ షెడ్లు మార్కింగ్‌లకే పరిమితం

జిల్లాలోని సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. అధికారుల అలసత్వం స్పష్టంగా కన్పిస్తోంది. నిర్మాణాలను త్వరతిగతిన పూర్తిచేయాలని అధికారులు ఆదేశిస్తున్నా నేటికీ మార్కింగ్‌లతోనే కాలం వెళ్లదీస్తున్నారు.

అడ్వాన్సు నిధుల కోసం ప్రతిపాదనలు

వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలలో ఏర్పడిన ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్‌ చర్యలు చేపట్టారు. తక్కువ ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీలను ఆదుకునేందుకు నిధులను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. అడ్వాన్సు నిధులకోసం వాజేడు మండలంలోని పదిహేడు గ్రామ పంచాయతీలలో పదకొండింటికి నిధులు కావాలంటూ ప్రతిపాదనలు పంపారు. వైకుంఠధామాలకు రూ.2 లక్షలు, సెగ్రిగేషన్‌ షెడ్డుకు లక్ష చొప్పున ఒక్కో జీపీకి రూ.3 లక్షలు కావాలన్నారు.

బిల్లుల చెల్లింపులు చేస్తున్నాం..

-అంకూస్‌, ఏపీవో

అభివృద్ధి పనుల నిర్మాణాలకు చెల్లింపులు చేపట్టాం. డంపింగ్‌ యార్డులు పూర్తయ్యాయి. వైకుంఠధామాలు పురోగతిలో ఉన్నాయి. సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలను మొదలుపెట్టాం.

ఇవీ చూడండి: కబ్జాకోరల నుంచి బయటపడ్డ కిందికుంట చెరువు

ములుగు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల వేగంలో నత్తే నయం అనిపిస్తోంది. మౌలిక వసతుల లోపంతో ప్రజలు ఇబ్బందులు ఏర్పడకూడదనే ఉద్దేశంతో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. ఉపాధి హామీ పథకం నుంచి రావాల్సిన బిల్లులను చెల్లించడంలో అధికారులు చేస్తున్న జాప్యంతో పనులు ముందుకు సాగడంలేదు. జిల్లాలోని 174 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామం, సెగ్రిగేషన్‌ షెడ్లు, డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

వీటికి ఉపాధిహామీ పథకం ద్వారా సుమారు రూ.28.71 కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో వైకుంఠధామానికి రూ.12 లక్షలు, సెగ్రిగేషన్‌ షెడ్డుకు రూ.2.50 లక్షలు , డంపింగ్‌ యార్డుకు రూ.2 లక్షలు ఖర్చుచేయాలి. తడి, పొడి చెత్తను వేరుచేసి కంపోస్టు ఎరువును తయారు చేసే సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణానికి వర్షాకాలం సమీపించినా అధికారులు మార్కింగ్‌లు ఇవ్వడంలోనే ఉన్నారు. కలెక్టర్‌ మందలించినా అధికారులు, ప్రజాప్రతినిధులు, గుత్తేదారులలో కదలిక లేకపోతోంది. మిషన్‌తో పనిచేసేందుకు అవకాశం ఉన్న డంపింగ్‌ యార్డుల పనులను వేగంగా పూర్తిచేసిన అధికారులు వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్నారు.

బిల్లుల జాప్యంతో లెంటల్‌ స్థాయిలోనే నిలిచిపోయిన టేకులగూడెం వైకుంఠధామం

భూసమస్యతో కొన్ని.. లాక్‌డౌన్‌ సాకుతో మరికొన్ని..

వెంకటాపూర్‌ మండలంలో డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి మూడు గ్రామపంచాయతీలలో భూ సమస్య ఏర్పడింది. ములుగు మండలంలో తొమ్మిది, ఏటూరునాగారం మండలంలో మూడు, వాజేడు మండలంలో దూలాపురం, గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీల్లో వైకుంఠధామం పనులు ప్రారంభం కాలేదు. కొంగాల వైకుంఠధామానికి చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని వర్షం పేరుతో మధ్యలోనే నిలిపేశారు.

ఆలస్యంగా చెల్లింపులు..

వైకుంఠధామాలను నిర్మిస్తున్న గుత్తేదారులకు బిల్లులను చెల్లించడంలో ఏర్పడిన ఆలస్యంతో పనులలో వేగం లోపించింది. వైకుంఠధామాలను నిర్మించేందుకు ఇప్పటికే సుమారు రూ.6 నుంచి రూ.8లక్షల అప్పులుచేసి పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు కేవలం రూ.1.06లక్షలను మాత్రమే చెల్లించడంతో తలలు పట్టుకుంటున్నారు. వాజేడు మండలంలోని కొంగాల, నాగారం, టేకులగూడెం వైకుంఠధామాలు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పీఆర్‌ శాఖ నుంచి చేపట్టిన నిర్మాణాలకు ఇప్పుడిప్పుడే మార్కింగ్‌ ఇస్తున్నారు.

బిల్లుల జాప్యంతో అసంపూర్తిగా కొంగాల గ్రామ పంచాయతీ వైకుంఠధామం

సెగ్రిగేషన్‌ షెడ్లు మార్కింగ్‌లకే పరిమితం

జిల్లాలోని సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. అధికారుల అలసత్వం స్పష్టంగా కన్పిస్తోంది. నిర్మాణాలను త్వరతిగతిన పూర్తిచేయాలని అధికారులు ఆదేశిస్తున్నా నేటికీ మార్కింగ్‌లతోనే కాలం వెళ్లదీస్తున్నారు.

అడ్వాన్సు నిధుల కోసం ప్రతిపాదనలు

వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలలో ఏర్పడిన ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్‌ చర్యలు చేపట్టారు. తక్కువ ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీలను ఆదుకునేందుకు నిధులను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. అడ్వాన్సు నిధులకోసం వాజేడు మండలంలోని పదిహేడు గ్రామ పంచాయతీలలో పదకొండింటికి నిధులు కావాలంటూ ప్రతిపాదనలు పంపారు. వైకుంఠధామాలకు రూ.2 లక్షలు, సెగ్రిగేషన్‌ షెడ్డుకు లక్ష చొప్పున ఒక్కో జీపీకి రూ.3 లక్షలు కావాలన్నారు.

బిల్లుల చెల్లింపులు చేస్తున్నాం..

-అంకూస్‌, ఏపీవో

అభివృద్ధి పనుల నిర్మాణాలకు చెల్లింపులు చేపట్టాం. డంపింగ్‌ యార్డులు పూర్తయ్యాయి. వైకుంఠధామాలు పురోగతిలో ఉన్నాయి. సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలను మొదలుపెట్టాం.

ఇవీ చూడండి: కబ్జాకోరల నుంచి బయటపడ్డ కిందికుంట చెరువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.