ములుగు జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం పడడం వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడటం వల్ల రోడ్లన్ని జలమయం అయ్యాయి. నిన్నటి వరకు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు వాతావరణం చల్లబడటం వల్ల ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇవీచూడండి: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై ఉత్తమ్ స్పందన