కరోనా కట్టడికి వైద్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వ్యక్తులను గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వస్తే వెంటనే క్వారంటైన్లో ఉంచాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య వైద్యులకు సూచించారు. ఇప్పటికి జిల్లాలో ఐదారుగురికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని, వారంతా పద్నాలుగు రోజులు పూర్తి చేసుకుంటారని తెలిపారు.
జూన్ 25న ప్రారంభమైన హరితహారం జిల్లాలో ఇంకా కొనసాగుతూనే ఉన్నదని కలెక్టర్ అన్నారు. ఎర్ర నేల భూములు, నల్లరేగడి భూములు ఉన్న రైతులకు ఎలాంటి పండ్లతోటలు కావాలన్న అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. పండ్ల మొక్కలు నాటేందుకు ఎస్సీ, ఎస్టీలకు పూర్తి సబ్సిడీ వర్తిస్తుందని, ఇతరులకు 90% సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. పోడు భూములు, అసైన్మెంట్ భూములు, రైతులు సాగు చేయకుండా ఉన్న బీడు భూముల్లో, సొంత పొలం గట్లపై మొక్కలు నాటితే నెలకు ఒక్కొక్క మొక్కకు ఐదు రూపాయల చొప్పున చెల్లిస్తామని అన్నారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా