పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం ములుగు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. రేపు జరిగే ఎన్నికల్లో అందరు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్నికల సిబ్బందితో పాటు సామాగ్రిని తరలించామని వెల్లడించారు. జిల్లాలోని 9 మండలాల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 105 మంది అధికారులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను నియమించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తైన పోలింగ్ ఏర్పాట్లు