ETV Bharat / state

నెలలు నిండక ముందే ఇంజక్షన్.. పాప మృతి

ఓ గర్భిణీకి నెలలు నిండక ముందే ప్రసవ ఇంజక్షన్ ఇచ్చారు. అతికష్టం మీద ఆమె పాపకు జన్మనివ్వగా.. పురిట్లోనే ఆ పాప చనిపోయింది. బాధితురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

author img

By

Published : Sep 25, 2019, 9:15 PM IST

పాప మృతి

ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఓ గర్భిణీకి నెలలు నిండక ముందే ఇంజక్షన్ ఇచ్చి ప్రసవం చేయించారని.. పూర్తిగా నెలలు నిండని పాప ప్రసవం అయిన తర్వాత చనిపోయిందని ఆరోపిస్తూ.. బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా నిర్వహించారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గొర్లవేడుకు చెందిన చల్ల మౌనిక గర్భిణీ. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల శనివారం ములుగు ఏరియా ఆసుపత్రిలో చేరారు. అదే ఆసుపత్రిలో అదే పేరు గల మరో గర్భిణీ ఉండడం వల్ల ఆమె ప్రసవం కోసం ఇచ్చిన ఇంజక్షన్​ను నర్సు నెలలు నిండని మౌనికకు ఇచ్చింది. మౌనికకు ప్రసవ నొప్పులు వచ్చి అతికష్టంగా పాపకు జన్మనిచ్చిందని, పుట్టిన పాపకు శ్వాస ఆడకపోవడం వల్ల వరంగల్ ఎంజీఎంకు తరలించాక పాప మృతి చెందిందని బాధితురాలు పేర్కొంది. నెలలు నిండని మౌనికకు ఇచ్చిన ఇంజక్షన్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ చావుబతుకుల్లో ఉందని కుటుంబ సభ్యులు వాపోయారు. బాధితురాలి బంధువులు ములుగు ఏరియా ముందు ధర్నా నిర్వహించారు. నెలలు నిండని మౌనికకు ఇంజక్షన్ ఇచ్చి పాప మృతికి కారకులైన వైద్యులను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు.

ములుగు ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళన

ఇదీ చూడండి: కొత్త వాహన చట్టంపై సీపీ అవగాహన

ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఓ గర్భిణీకి నెలలు నిండక ముందే ఇంజక్షన్ ఇచ్చి ప్రసవం చేయించారని.. పూర్తిగా నెలలు నిండని పాప ప్రసవం అయిన తర్వాత చనిపోయిందని ఆరోపిస్తూ.. బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా నిర్వహించారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గొర్లవేడుకు చెందిన చల్ల మౌనిక గర్భిణీ. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల శనివారం ములుగు ఏరియా ఆసుపత్రిలో చేరారు. అదే ఆసుపత్రిలో అదే పేరు గల మరో గర్భిణీ ఉండడం వల్ల ఆమె ప్రసవం కోసం ఇచ్చిన ఇంజక్షన్​ను నర్సు నెలలు నిండని మౌనికకు ఇచ్చింది. మౌనికకు ప్రసవ నొప్పులు వచ్చి అతికష్టంగా పాపకు జన్మనిచ్చిందని, పుట్టిన పాపకు శ్వాస ఆడకపోవడం వల్ల వరంగల్ ఎంజీఎంకు తరలించాక పాప మృతి చెందిందని బాధితురాలు పేర్కొంది. నెలలు నిండని మౌనికకు ఇచ్చిన ఇంజక్షన్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ చావుబతుకుల్లో ఉందని కుటుంబ సభ్యులు వాపోయారు. బాధితురాలి బంధువులు ములుగు ఏరియా ముందు ధర్నా నిర్వహించారు. నెలలు నిండని మౌనికకు ఇంజక్షన్ ఇచ్చి పాప మృతికి కారకులైన వైద్యులను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు.

ములుగు ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళన

ఇదీ చూడండి: కొత్త వాహన చట్టంపై సీపీ అవగాహన

Intro:tg_wgl_52_25_hospatal_mundu_darna_ab_ts10072_HD
G Raju mulugu. contributar

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ముందు నెలలు నిండక ముందే ఇంజక్షన్ ఇచ్చి అతి కష్టంగా ప్రసవం చేయించారని పూర్తిగా నెలలు నిండని పాప ప్రసవం అయిన తర్వాత చనిపోయిందని ఆసుపత్రి ముందు బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులతో ధర్నా చేశారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గొర్లవేడు గ్రామానికి చెందిన చల్ల మౌనిక గర్భిణీ స్త్రీ నీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ములుగు ఏరియా ఆసుపత్రి శనివారం రాత్రి పదకొండు పదకొండు గంటలకు జాయిన్ అయ్యారు. అదే ఆసుపత్రిలో మరో గర్భిణీ స్త్రీ మౌనిక ఉండడంతో ఆమె ప్రసవం కోసం అం ఇంజక్షన్ వెయ్యాలని వచ్చిన నర్సు నెలలు నిండని చల్ల మౌనిక కు ఇంజక్షన్ వేయడంతో ప్రసవ నొప్పులు వచ్చి అతికష్టంగా పాపకు జన్మనిచ్చిందని, పుట్టిన పాపకు శ్వాస ఆడకపోవడం తో వరంగల్ ఎంజీఎం కు తరలించాక పాప మృతి చెందిందని, నెలలు నిండని మౌనిక కు ఇంజక్షన్ వేయడంతో ఇన్ఫెక్షన్ రావడం వల్ల హన్మకొండ మిషన్ హాస్పిటల్ తరలించగా అది ఆసుపత్రి డాక్టర్లు పట్టకపోవడంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ ఆస్పత్రిలో కూడా అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ చావుబతుకుల్లో ఉందని కుటుంబ సభ్యులు బంధువులు ములుగు ఏరియా వంద పడకల ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. నెలలు నిండని మౌనిక కు ఇంజక్షన్ ఇచ్చి పాప మృతికి కారకులైన డాక్టర్ ని సస్పెండ్ చేయాలంటూ ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు.


Body:ss


Conclusion:బైట్ : సదమ్మ మౌనిక మేనత్త
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.