ETV Bharat / state

Godavari floods: గోదావరి తీరంలో భూములెలా మాయమవుతున్నాయి? రైతులు ఏమంటున్నారు? - godavari flood flow to coastal area villages

ములుగు జిల్లాలో గోదావరి ప్రవాహం తీవ్రరూపం దాలుస్తోంది. వర్షాకాలం వస్తే చాలు.. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వచ్చే వరద ఉద్ధృతికి పంట పొలాలు దెబ్బతింటున్నాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఒడ్డు నదిలో కలిసిపోతోంది. భారీ వర్షాలు పడితే చాలు ఏ సమయంలో ఉప్పెన ఊరిని ముంచేస్తుందో తెలియక.. భయం గుప్పిట్లో పొదుమూరు గ్రామస్తులు బతుకుతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Godavari floods
ములుగు జిల్లాలో గోదారి ఉద్ధృతి
author img

By

Published : Jul 18, 2021, 3:12 PM IST

ములుగు జిల్లాలో గోదావరి ఉద్ధృతి

గోదావరి జలాలతో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉండవని తీర ప్రాంత ప్రజలు మురిసిపోయారు. కానీ ఆ గోదారమ్మ పచ్చని పంట పొలాలను ప్రతి ఏటా తనలో కలుపుకుంటోంది. భూమిని నమ్ముకొని ఎన్నో ఆశలతో అప్పు తెచ్చి.. పెట్టుబడి పెట్టిన రైతుకు నిరాశే మిగులుతోంది. పంట పచ్చగా ఉన్నప్పుడు గోదారి ఉద్ధృతికి నీటిపాలవుతోంది. ములుగు జిల్లాలోని మంగపేట మండల కేంద్రం సమీపం నుంచి పవిత్ర గోదావరి ప్రవహిస్తోంది. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహించడంతో ఒడ్డు కోతకు గురవుతోంది. రైతుల కళ్లెదుటే పచ్చని పొలాలు గోదావరిలో కలిసిపోతున్నాయి. గంపోనిగూడెం, మంగపేట, పొదుమూరు గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతుల పంట భూములు వరద ఉద్ధృతికి విలవిల్లాడుతున్నాయి. రెండు దశాబ్దాలుగా రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.

కరకట్ట నిర్మాణం ఎప్పుడు..

వర్షాకాలంలో గోదావరి నిండుగా ప్రవహించడంతో పొదుమూరు గ్రామస్థులను.. అధికారులు మంగపేట, కమలాపురం పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో గోదావరి ప్రవాహం పెరిగినప్పుడల్లా పొదుమూరు ప్రజల ఆందోళనకు అంతులేదు. కమలాపురం సమీప సీతమ్మ గుడి నుంచి మంగపేట పుష్కర ఘాట్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల పొడవున పంటపొలాలు కోతకు గురవుతున్నాయి. దీంతో లక్షల రూపాయల విలువచేసే పంటపొలాలు నదిలో కలిసిపోతున్నాయి. గోదావరి ఒడ్డుకు కరకట్టల నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు స్థానికులు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. అయినా కరకట్ట నిర్మాణానికి మోక్షం కలగలేదు.

ఎండాకాలం నెర్రెలు పారిన భూమి అంతా.. వర్షాకాలంలో కొట్టుకోతోంది. కరకట్టలు నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కానీ ఇంతవరకూ నిర్మాణం చేపట్టలేదు. మాకు పునరావాసం కల్పించాలని వేడుకుంటున్నాం. -శ్రీనివాస్​, పొదుమూరు

పగిలిన పుష్కర ఘాట్​

గోదావరి ఉద్ధృతికి రూ. కోట్ల రూపాయలతో నిర్మించిన పుష్కర ఘాట్ సైతం ముక్కలైంది. ఘాట్​ పై భాగంలోని బీట్ రోడ్డు నదిలో కలిసిపోయింది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2015లో పుష్కర ఘాట్ నిర్మించింది. గోదావరి పుష్కరాల సమయంలో ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. పుష్కరాల సమయంలో జన సందడి నెలకొంటుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం భావించింది కానీ పుష్కరఘాట్.. మళ్లీ పుష్కరాలు రాకముందే పూర్తిగా శిథిలమైంది.

2016 సెప్టెంబర్ 26 న అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, గిరిజన శాఖ మంత్రి అజ్మీర చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ.. మంగపేట పుష్కరఘాట్ పైభాగంలో కోతకు గురవుతున్న పంట భూములను పరిశీలించారు. పుష్కర ఘాట్ పంటభూములు కోతకు గురికాకుండా కరకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధిత ప్రజలు తమ కష్టాలు తీరుతాయని సంబరపడ్డారు. ఐదేళ్లు దాటిపోతున్నా వారి హామీ నోటి మాటకే పరిమితమైంది. నిర్మాణం దిశగా ఒక్క అడుగూ పడలేదు.

ప్రతి ఏటా నాయకులు, అధికారులు వస్తున్నారు.. చూసి వెళ్లిపోతున్నారు. కానీ సమస్య పరిష్కారంలో చొరవ చూపడం లేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. -జంపన్న, పొదుమూరు

ముంపు భయం

వర్షాకాలం వచ్చిందంటే గోదావరి నిండుగా ప్రవహించిన ప్రతిసారీ భయంగా ఉంటుంది. గ్రామాలన్నీ నిద్రలేని రాత్రులు గడపాల్సివస్తుంది. పొదుమూరు, గోదావరికి కేవలం మూడు వందల మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. పుష్కర ఘాట్ పై భాగంలో గోదావరి సమీపంలో చెరువు ఉంది ఆ చెరువులోకి నీరు చేరితే పొదుమూరు మొత్తం గోదావరిలో కొట్టుకుపోతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి సంవత్సరం గోదావరి ప్రవాహం పెరిగినప్పుడల్లా అధికారులు.. ఇళ్లను ఖాళీ చేయించి మంగపేట, కమలాపూర్​లో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా పిల్లాపాపలతో ఇల్లు వదిలి వెళ్లడం బాధాకరంగా ఉందని.. గోదావరి ముంపు ప్రాంతాల వారికి ప్రభుత్వ స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఏటా కొంచెం భూమి వరదల్లో కొట్టుకుపోతోంది. ఇప్పుడు మాకంటూ ఏమీ లేదు. కూలీ చేసుకొని బతుకుతున్నాం. వరదలొస్తే పోలీసులు మమ్మల్ని తీసుకెళ్లి కమలాపూర్​ గ్రామంలో ఉంచుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకోవాలి. -స్వరూప, మంగపేట

ప్రభుత్వం ఆదుకునేనా.?

గోదావరి ఉద్ధృతికి తీర ప్రాంతంలో ఉన్న ఎకరం పంట భూమి నదిలో కలిసిపోయిందని అధికారులు సర్వే చేసి వివరాలు తీసుకున్నారు. అందరికీ పరిహారం ఇస్తామన్నారు కానీ ఇప్పటివరకు అందలేదు. మళ్లీ ఉద్ధృతి పెరిగితే నష్టపోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా కరకట్టల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని.. లేనిపక్షంలో బాధిత కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి గృహాల నిర్మాణం చేపట్టాలని వేడుకుంటున్నారు. గోదావరిలో కొట్టుకుపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని లేదంటే భూమి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: TERRACE GARDENING: మిద్దె తోటలు పెంచాలనుకుంటున్నారా.. మేము తోడుగా ఉంటాం..!

ములుగు జిల్లాలో గోదావరి ఉద్ధృతి

గోదావరి జలాలతో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉండవని తీర ప్రాంత ప్రజలు మురిసిపోయారు. కానీ ఆ గోదారమ్మ పచ్చని పంట పొలాలను ప్రతి ఏటా తనలో కలుపుకుంటోంది. భూమిని నమ్ముకొని ఎన్నో ఆశలతో అప్పు తెచ్చి.. పెట్టుబడి పెట్టిన రైతుకు నిరాశే మిగులుతోంది. పంట పచ్చగా ఉన్నప్పుడు గోదారి ఉద్ధృతికి నీటిపాలవుతోంది. ములుగు జిల్లాలోని మంగపేట మండల కేంద్రం సమీపం నుంచి పవిత్ర గోదావరి ప్రవహిస్తోంది. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహించడంతో ఒడ్డు కోతకు గురవుతోంది. రైతుల కళ్లెదుటే పచ్చని పొలాలు గోదావరిలో కలిసిపోతున్నాయి. గంపోనిగూడెం, మంగపేట, పొదుమూరు గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతుల పంట భూములు వరద ఉద్ధృతికి విలవిల్లాడుతున్నాయి. రెండు దశాబ్దాలుగా రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.

కరకట్ట నిర్మాణం ఎప్పుడు..

వర్షాకాలంలో గోదావరి నిండుగా ప్రవహించడంతో పొదుమూరు గ్రామస్థులను.. అధికారులు మంగపేట, కమలాపురం పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో గోదావరి ప్రవాహం పెరిగినప్పుడల్లా పొదుమూరు ప్రజల ఆందోళనకు అంతులేదు. కమలాపురం సమీప సీతమ్మ గుడి నుంచి మంగపేట పుష్కర ఘాట్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల పొడవున పంటపొలాలు కోతకు గురవుతున్నాయి. దీంతో లక్షల రూపాయల విలువచేసే పంటపొలాలు నదిలో కలిసిపోతున్నాయి. గోదావరి ఒడ్డుకు కరకట్టల నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు స్థానికులు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. అయినా కరకట్ట నిర్మాణానికి మోక్షం కలగలేదు.

ఎండాకాలం నెర్రెలు పారిన భూమి అంతా.. వర్షాకాలంలో కొట్టుకోతోంది. కరకట్టలు నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. కానీ ఇంతవరకూ నిర్మాణం చేపట్టలేదు. మాకు పునరావాసం కల్పించాలని వేడుకుంటున్నాం. -శ్రీనివాస్​, పొదుమూరు

పగిలిన పుష్కర ఘాట్​

గోదావరి ఉద్ధృతికి రూ. కోట్ల రూపాయలతో నిర్మించిన పుష్కర ఘాట్ సైతం ముక్కలైంది. ఘాట్​ పై భాగంలోని బీట్ రోడ్డు నదిలో కలిసిపోయింది. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2015లో పుష్కర ఘాట్ నిర్మించింది. గోదావరి పుష్కరాల సమయంలో ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. పుష్కరాల సమయంలో జన సందడి నెలకొంటుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం భావించింది కానీ పుష్కరఘాట్.. మళ్లీ పుష్కరాలు రాకముందే పూర్తిగా శిథిలమైంది.

2016 సెప్టెంబర్ 26 న అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, గిరిజన శాఖ మంత్రి అజ్మీర చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ.. మంగపేట పుష్కరఘాట్ పైభాగంలో కోతకు గురవుతున్న పంట భూములను పరిశీలించారు. పుష్కర ఘాట్ పంటభూములు కోతకు గురికాకుండా కరకట్ట నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధిత ప్రజలు తమ కష్టాలు తీరుతాయని సంబరపడ్డారు. ఐదేళ్లు దాటిపోతున్నా వారి హామీ నోటి మాటకే పరిమితమైంది. నిర్మాణం దిశగా ఒక్క అడుగూ పడలేదు.

ప్రతి ఏటా నాయకులు, అధికారులు వస్తున్నారు.. చూసి వెళ్లిపోతున్నారు. కానీ సమస్య పరిష్కారంలో చొరవ చూపడం లేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. -జంపన్న, పొదుమూరు

ముంపు భయం

వర్షాకాలం వచ్చిందంటే గోదావరి నిండుగా ప్రవహించిన ప్రతిసారీ భయంగా ఉంటుంది. గ్రామాలన్నీ నిద్రలేని రాత్రులు గడపాల్సివస్తుంది. పొదుమూరు, గోదావరికి కేవలం మూడు వందల మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. పుష్కర ఘాట్ పై భాగంలో గోదావరి సమీపంలో చెరువు ఉంది ఆ చెరువులోకి నీరు చేరితే పొదుమూరు మొత్తం గోదావరిలో కొట్టుకుపోతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి సంవత్సరం గోదావరి ప్రవాహం పెరిగినప్పుడల్లా అధికారులు.. ఇళ్లను ఖాళీ చేయించి మంగపేట, కమలాపూర్​లో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా పిల్లాపాపలతో ఇల్లు వదిలి వెళ్లడం బాధాకరంగా ఉందని.. గోదావరి ముంపు ప్రాంతాల వారికి ప్రభుత్వ స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఏటా కొంచెం భూమి వరదల్లో కొట్టుకుపోతోంది. ఇప్పుడు మాకంటూ ఏమీ లేదు. కూలీ చేసుకొని బతుకుతున్నాం. వరదలొస్తే పోలీసులు మమ్మల్ని తీసుకెళ్లి కమలాపూర్​ గ్రామంలో ఉంచుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకోవాలి. -స్వరూప, మంగపేట

ప్రభుత్వం ఆదుకునేనా.?

గోదావరి ఉద్ధృతికి తీర ప్రాంతంలో ఉన్న ఎకరం పంట భూమి నదిలో కలిసిపోయిందని అధికారులు సర్వే చేసి వివరాలు తీసుకున్నారు. అందరికీ పరిహారం ఇస్తామన్నారు కానీ ఇప్పటివరకు అందలేదు. మళ్లీ ఉద్ధృతి పెరిగితే నష్టపోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా కరకట్టల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని.. లేనిపక్షంలో బాధిత కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి గృహాల నిర్మాణం చేపట్టాలని వేడుకుంటున్నారు. గోదావరిలో కొట్టుకుపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని లేదంటే భూమి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: TERRACE GARDENING: మిద్దె తోటలు పెంచాలనుకుంటున్నారా.. మేము తోడుగా ఉంటాం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.