ETV Bharat / state

జనాలతో కిటకిటలాడుతున్న మేడారం బస్టాండ్లు - LAST DAY OF MEDARAM JATHARA

మేడారం మహా జాతరకు భక్తజనం పోటెత్తింది. తల్లులను దర్శించుకునేందుకు ఊరు వాడ తరలివచ్చి అమ్మలను దర్శించుకుంది. అందరూ అనుకున్నట్లుగానే లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మల ఆశీర్వచనాలు పొంది.... మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం జాతరకు లక్షలాదిగా తరలివచ్చిన వచ్చిన భక్తులు తమ ఊర్లకు పయనమవుతున్నారు. ఇందుకు అనుగుణంగా భక్తులను తరలించేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

special buses in medaram
జనాలతో కిటకిటలాడుతున్న మేడారం బస్టాండ్లు
author img

By

Published : Feb 8, 2020, 6:15 PM IST

జనాలతో కిటకిటలాడుతున్న మేడారం బస్టాండ్లు

ఆసియాలోనే అతిపెద్ద కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతర ముగింపు దశకు చేరుకుంది. ఒకప్పుడు కేవలం గిరిజనులకు మాత్రమే పరిమితమైన ఈ జాతర నేడు జనజాతరగా మారి కోటి మందికి పైగా తరలి వచ్చేలా మారింది. సమ్మక్క, సారలమ్మల చల్లని చూపులు ఎల్లప్పుడు తమపై ఉండాలంటూ మెక్కులు చెల్లించుకున్న వారంతా తమ నివాస ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. భక్తులు తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరేందుకు తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది .

మహారాష్ట్రకూ బస్సుల ఏర్పాటు..

ఇప్పటివరకు 12 లక్షల మందికి పైగా భక్తులను తరలించారు. చివరిరోజు రద్దీకి తగ్గట్టుగా బస్సులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని సిరోంచ ప్రాంతానికి కూడాబస్సులు అందుబాటులో ఉంచింది. జాతరకు వచ్చిన లక్షలాది మంది ఒకేసారి తిరుగుపయనం అవుతుండటం వల్ల ఆర్టీసీ చేసిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సమావేశమై సమీక్షించారు.

జానపద గీతాలతో అవగాహన కార్యక్రమాలు

నిన్నటి వరకూ ఆలయ క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడగా... నేడు వారంతా తరలివెళ్తుండటం వల్ల ఆర్టీసీ బస్ డిపో క్యూలైన్లు రద్దీగా మారాయి. ప్రయాణికులకు సూచనలతో పాటు ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని తెలియజేస్తూ కళా జాతర బృందాలచే జానపద గీతాలతో అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఇవీ చూడండి: మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం

జనాలతో కిటకిటలాడుతున్న మేడారం బస్టాండ్లు

ఆసియాలోనే అతిపెద్ద కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతర ముగింపు దశకు చేరుకుంది. ఒకప్పుడు కేవలం గిరిజనులకు మాత్రమే పరిమితమైన ఈ జాతర నేడు జనజాతరగా మారి కోటి మందికి పైగా తరలి వచ్చేలా మారింది. సమ్మక్క, సారలమ్మల చల్లని చూపులు ఎల్లప్పుడు తమపై ఉండాలంటూ మెక్కులు చెల్లించుకున్న వారంతా తమ నివాస ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. భక్తులు తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరేందుకు తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది .

మహారాష్ట్రకూ బస్సుల ఏర్పాటు..

ఇప్పటివరకు 12 లక్షల మందికి పైగా భక్తులను తరలించారు. చివరిరోజు రద్దీకి తగ్గట్టుగా బస్సులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని సిరోంచ ప్రాంతానికి కూడాబస్సులు అందుబాటులో ఉంచింది. జాతరకు వచ్చిన లక్షలాది మంది ఒకేసారి తిరుగుపయనం అవుతుండటం వల్ల ఆర్టీసీ చేసిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సమావేశమై సమీక్షించారు.

జానపద గీతాలతో అవగాహన కార్యక్రమాలు

నిన్నటి వరకూ ఆలయ క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడగా... నేడు వారంతా తరలివెళ్తుండటం వల్ల ఆర్టీసీ బస్ డిపో క్యూలైన్లు రద్దీగా మారాయి. ప్రయాణికులకు సూచనలతో పాటు ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని తెలియజేస్తూ కళా జాతర బృందాలచే జానపద గీతాలతో అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఇవీ చూడండి: మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.