ETV Bharat / state

ప్రమాదకరమని తెలిసినా.. రామప్ప ఆలయానికి అలాగే వెళ్తున్నారు! - ప్రమాదకరంగా రామప్ప ఆలయ రహదారి

ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలంలోని రామప్ప ఆలయానికి వెళ్లే రోడ్డు కొట్టుకుపోయింది. అయితే ఇటీవలే వేసిన మిషన్​భగీరథ పైపుల మీద నడుస్తూ భక్తులు ఆలయానికి వెళ్తున్నారు.

devotees problems to reach ramappa temple as road damaged
ప్రమాదకరమని తెలిసినా.. రామప్ప ఆలయానికి అలాగే వెళ్తున్నారు!
author img

By

Published : Sep 29, 2020, 5:04 PM IST

ములుగు జిల్లాలో ప్రఖ్యాత శిల్పాలు కొలువు తీరిన పర్యాటక కేంద్రం రామప్ప ఆలయానికి వెళ్లాలంటే భక్తులు, సందర్శకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి నెల రోజుల క్రితం చెరువు మత్తడి ప్రవాహంలో కొట్టుకుపోయింది.

అయితే.. ఆ మార్గంలో మిషన్​ భగీరథ పైపులు ధ్వంసం కాగా.. అధికారులు ఇటీవలే కొత్త పైప్​లైన్ వేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆలయం చేరుకోవడానికి ఆ పైప్​లైనే ఆధారంగా మారింది. ప్రమాదమని తెలిసినా ఒకరిని చూసి మరొకరు పైప్​లైన్​పై నడుస్తూ రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నారు.

ములుగు జిల్లాలో ప్రఖ్యాత శిల్పాలు కొలువు తీరిన పర్యాటక కేంద్రం రామప్ప ఆలయానికి వెళ్లాలంటే భక్తులు, సందర్శకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి నెల రోజుల క్రితం చెరువు మత్తడి ప్రవాహంలో కొట్టుకుపోయింది.

అయితే.. ఆ మార్గంలో మిషన్​ భగీరథ పైపులు ధ్వంసం కాగా.. అధికారులు ఇటీవలే కొత్త పైప్​లైన్ వేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆలయం చేరుకోవడానికి ఆ పైప్​లైనే ఆధారంగా మారింది. ప్రమాదమని తెలిసినా ఒకరిని చూసి మరొకరు పైప్​లైన్​పై నడుస్తూ రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నారు.

ఇదీ చదవండిః 6న అపెక్స్​ కౌన్సిల్ సమావేశం.. జల వివాదాలపై చర్చ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.