వర్షం కారణంగా పొలంలో పెరిగిన కలుపు తొలగించేందుకు మనుషులే కాడెడ్లలా మారారు. గంట పాటు శ్రమించి నాగలి లాగుతూ కలుపు తొలగించారు. ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు మోట్లగూడెంలో ఈ సంఘటన జరిగింది.
గ్రామానికి చెందిన లొల్లి శంకర్ అనే రైతు పత్తి సాగు చేస్తున్నాడు. వర్షం కారణంగా... పెరిగిన కలుపు తొలగించడానికి ఎడ్లు అరువు అడిగారు. ఎవరూ సమయానికి స్పందిచకపోవడం వల్ల భార్యతో కలిసి నాగలి చేత పట్టి తొలగించారు. గంటపాటు నాగలి లాగి అర ఎకరం కలుపు తీసినట్టు తెలిపారు.
ఇదీ చదవండి: గాంధీలో ఆందోళనకు దిగిన ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది