ETV Bharat / state

తప్పుల తడకగా ముసాయిదా ఓటర్ల జాబితా - దుండిగల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్ల తప్పులు

మున్సిపాలిటీ ఎన్నికల్లో తప్పులు దొర్లకుండా చేస్తామంటున్న అధికారుల మాట ముమ్మాటికి తప్పని నిరూపిస్తోంది వారి తీరు. వార్డుల వారీగా కులగణను ఒకటికి రెండు సార్లు చేసినా... తప్పులను మాత్రం గుర్తించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

votes issue at dundigal
తప్పుల తడకగా మూసాయిదా ఓటర్ల జాబితా
author img

By

Published : Jan 2, 2020, 4:33 PM IST

Updated : Jan 2, 2020, 4:46 PM IST

మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అధికారులు రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. వార్డుల వారీగా కులగణనను చేసిన అధికారులు తప్పులను గుర్తించకలేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

పలు వార్డులలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం, మృతిచెందిన వారికి ఓట్లు ఇవ్వడంపై రాజకీయ నాయకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రెండు ఇంటి నంబరులపై భారీ మొత్తంలో ఓట్లు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డికి ఫిర్యాదు చేశారు.

మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు, కులగణన చేసినప్పటికీ తప్పులు దొర్లడం పట్ల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

తప్పుల తడకగా ముసాయిదా ఓటర్ల జాబితా

ఇవీ చూడండి: వెలుతురులేమితో వాహనాలు పరస్పరం ఢీ

మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అధికారులు రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. వార్డుల వారీగా కులగణనను చేసిన అధికారులు తప్పులను గుర్తించకలేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

పలు వార్డులలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం, మృతిచెందిన వారికి ఓట్లు ఇవ్వడంపై రాజకీయ నాయకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రెండు ఇంటి నంబరులపై భారీ మొత్తంలో ఓట్లు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డికి ఫిర్యాదు చేశారు.

మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు, కులగణన చేసినప్పటికీ తప్పులు దొర్లడం పట్ల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

తప్పుల తడకగా ముసాయిదా ఓటర్ల జాబితా

ఇవీ చూడండి: వెలుతురులేమితో వాహనాలు పరస్పరం ఢీ

Intro:Tg_Hyd_27_02_Dundigal_Thappu Votarlu_Av_Ts10011
మేడ్చల్ : దుండిగల్
దుండిగల్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అధికారులు రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పులతడకగా మారింది.Body: వార్థుల వారీగా కులగణనను ఒకటికి రెండుసార్లు చేసిన అధికారులు తప్పులను మాత్రం గుర్తించలేకపోవడం గమనార్హం. కులగణను స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేసే బిల్ కలెక్టర్, కిందిస్థాయి సిబ్బంది చేపట్టారు. ఇంటింటికి వెల్లి గణన చేసి ఉంటే ఇలాంటి తప్పులు జరిగిఉండేది కాదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పలువార్డులో ఒకే వ్యక్తికి
రెండేసి ఓటు ఉండటం.. మృతిచెందిన వారి పేరు మీద ఓట్లు ఉండటం, కులాలమార్పు, ఊరు వదిలి వెళ్లిన వారి ఓట్లు సైతం జాబితాలో చేర్చడం పై రాజకీయ నాయకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. దుండిగల్ లో రెండు ఇంటి నెం. 15-10, 15-11 లో 400 ఓట్లు
ఉన్నాయి. రెండు ఇంటి నెంబరులపై భారీ మొత్తంలో ఓట్లు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డికి ఫిర్యాదు చేశాడు. గాగిల్లాపూర్ లో 27 వార్డులో ఓటరు జాబితాలో 44, 45 లో మలోతూ కిషన్ నాయక్ పేరుతో రెండు ఓట్లు పక్కపక్కనే ఉండగా అదేవార్డులో ఓటరు జాబితాలో క్రమసంఖ్య 774, 775 లో మెహందర్ నాయక్ మలోత్, నాయక్ మలోథ్ పేరుతో ఒకే వ్యక్తి
ఫోటో తో రెండు ఓట్లు ఉన్నాయి. పేర్లు తప్పుగా దొర్లడంతో పక్కపక్కనే ఒకే ఓటు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అదేవార్డులో ఓటరు జాబితాలో క్రమసంఖ్య 4, 5లో ఊరు విడిచి వెళ్లిన చుక్కమ్మ, సక్కుబాయి ఓటు ఉంది. 27 వార్డులోనే మాలోతూ శంకర్
మృతిచెందినప్పటికీ ఓటు ఉందని, వినోద్ కుమార్ బీసీ అయినప్పటికీ ఎస్టీ జాబితాలో చేర్చారని స్థానిక నాయకులు అధికారులకు ఫిర్యాదు
చేశారు. బహదూర్పల్లి 12వ వార్డులో మహేష్ కాంపురీ, కాంపురీ మహేష్ పేరుతో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు నమోదు చేశారు. అదే
వారు లో సత్తిబాబు గనిశెట్టి, సత్తి గనిశెట్టి పేరుతో ఒకే వ్యక్తికి రెండేసి ఓట్లు నమోదు చేశారని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు, కులగణన చేసినప్పటికీ తప్పులు దొర్లడం పట్ల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు గాగిల్లాపూర్ 27 వార్డు కి సంబంధించి ఎ 1- బి6 వరకు అత్యధిక ఓట్లు ఉన్నాయని, వాటిని పరిశీలించాలని సానికులు కోరారు. ఇలా ఇంచుమించు ప్రతి వార్డులోనూ ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయని రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Conclusion:My name : Upender
Last Updated : Jan 2, 2020, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.