ETV Bharat / state

Revanth reddy: 'పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురండి'

author img

By

Published : Jun 11, 2021, 4:13 PM IST

Updated : Jun 11, 2021, 4:39 PM IST

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ఏఐసీసీ (Aicc) పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth reddy) హాజరయ్యారు. వరంగల్-హైదరాబాద్ రహదారిపై భారత్ పెట్రోలియం బంక్ వద్ద ఆయన బైఠాయించారు

Revanth reddy
జీఎస్టీ పరిధి

'పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురండి'

ప్రజా రవాణాపై 34 నుంచి 60 శాతం జీఎస్టీ వేస్తున్న కేంద్రం... విమానాల్లో ప్రయాణించే పెట్టుబడిదారులకు మాత్రం 3 శాతం పన్ను విధించడం ఏంటని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth reddy) ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి పేదల పక్షాన లేకపోవడం వల్ల ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు‌ నిరసిస్తూ అన్ని వర్గాలు నడుం బిగించి రోడ్లపైకొచ్చి బంద్​లకు పిలుపు ఇవ్వాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ఏఐసీసీ(Aicc)పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు ఆయన హాజరయ్యారు. వరంగల్- హైదరాబాద్ రహదారిపై భారత్ పెట్రోలియం బంక్ వద్ద బైఠాయించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తరలివచ్చారు.

మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఒకే దేశం-ఒకే విధానమైనప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఈ విషయంపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్రాల వైఫల్యాలపై జులైలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తామని‌ ఆయన వెల్లడించారు. అనంతరం ఎదిలాబాద్ నుంచి ఘట్​కేసర్ చౌరస్తా వరకు రేవంత్ రెడ్డి (Revanth reddy) పాదయాత్ర చేశారు.

ఇదీ చూడండి: Petrol Protest: పెట్రో ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్

'పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురండి'

ప్రజా రవాణాపై 34 నుంచి 60 శాతం జీఎస్టీ వేస్తున్న కేంద్రం... విమానాల్లో ప్రయాణించే పెట్టుబడిదారులకు మాత్రం 3 శాతం పన్ను విధించడం ఏంటని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth reddy) ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి పేదల పక్షాన లేకపోవడం వల్ల ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు‌ నిరసిస్తూ అన్ని వర్గాలు నడుం బిగించి రోడ్లపైకొచ్చి బంద్​లకు పిలుపు ఇవ్వాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ఏఐసీసీ(Aicc)పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు ఆయన హాజరయ్యారు. వరంగల్- హైదరాబాద్ రహదారిపై భారత్ పెట్రోలియం బంక్ వద్ద బైఠాయించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తరలివచ్చారు.

మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఒకే దేశం-ఒకే విధానమైనప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ఈ విషయంపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్రాల వైఫల్యాలపై జులైలో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తామని‌ ఆయన వెల్లడించారు. అనంతరం ఎదిలాబాద్ నుంచి ఘట్​కేసర్ చౌరస్తా వరకు రేవంత్ రెడ్డి (Revanth reddy) పాదయాత్ర చేశారు.

ఇదీ చూడండి: Petrol Protest: పెట్రో ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్

Last Updated : Jun 11, 2021, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.