ETV Bharat / state

లాక్​డౌన్​తో మంచి ఫలితాలు: మహేశ్ భగవత్

author img

By

Published : May 26, 2021, 12:47 PM IST

కరోనా కట్టడిలో భాగంగా అమలుచేస్తున్న లాక్​డౌన్ సత్ఫలితాలు ఇస్తోందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. కరోనా కేసులు, మరణాలు తగ్గాయని పేర్కొన్నారు. ఉప్పల్ పీఎస్ పరిధిలోని చెక్​పోస్టుల్లో ఆయన తనిఖీ చేశారు.

rachakonda cp mahesh bhagwat, rachakonda cp mahesh bhagwat visits uppal check posts
ఉప్పల్ చెక్​పోస్టులో సీపీ మహేశ్ భగవత్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ మంచి ఫలితాలు ఇస్తోందని రాచకొండ పోలీస్ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ అన్నారు. కమిషనరేట్‌ పరిధిలో లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తున్నందున కొవిడ్ కేసులు, మరణాలు తగ్గాయని తెలిపారు. ఉప్పల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని రామంతాపూర్‌, ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో సీపీ తనిఖీలు చేశారు. లాక్‌డౌన్‌ అమలు విధానాన్ని అక్కడి పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని... వాహనాలను సీజ్‌ చేస్తున్నామని సీపీ తెలిపారు. కొందరు అనవసరంగా బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. పౌరులు, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం పరస్పర సహకారంతోనే లాక్‌డౌన్‌ సత్ఫలితాలు ఇస్తోందని అన్నారు.

ఇదీ చదవండి: పల్లెల్లో కరోనా కల్లోలం.. వైరస్​ ఉద్ధృతికి కారణాలివే..!

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ మంచి ఫలితాలు ఇస్తోందని రాచకొండ పోలీస్ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ అన్నారు. కమిషనరేట్‌ పరిధిలో లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తున్నందున కొవిడ్ కేసులు, మరణాలు తగ్గాయని తెలిపారు. ఉప్పల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని రామంతాపూర్‌, ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో సీపీ తనిఖీలు చేశారు. లాక్‌డౌన్‌ అమలు విధానాన్ని అక్కడి పోలీసులను అడిగి తెలుసుకున్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని... వాహనాలను సీజ్‌ చేస్తున్నామని సీపీ తెలిపారు. కొందరు అనవసరంగా బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. పౌరులు, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం పరస్పర సహకారంతోనే లాక్‌డౌన్‌ సత్ఫలితాలు ఇస్తోందని అన్నారు.

ఇదీ చదవండి: పల్లెల్లో కరోనా కల్లోలం.. వైరస్​ ఉద్ధృతికి కారణాలివే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.