ETV Bharat / state

రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ దళిత సంఘాల ధర్నా

author img

By

Published : Mar 2, 2021, 3:02 PM IST

ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల అధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా నేడు మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట బస్​స్టాండ్ వద్ద దళితులు నిరసన చేపట్టారు.

protest by Dalit communities condemning Rajasingh comments at jagadgirigutta busstand
రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ దళిత సంఘాల ధర్నా

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ... మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట బస్​స్టాండ్ వద్ద దళితులు ఆందోళనకు దిగారు. దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. దళితులకు రాజాసింగ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తమకు క్షమాపణ చెప్పకపోతే పార్టీ నుంచి రాజాసింగ్​ను సస్పెండ్ చేయాలని పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్​ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టడానికైనా వెనుకాడబోమని వారు హెచ్చరించారు.

ఇటీవల ఓ సందర్భంలో రాజాసింగ్ గోమాంసం తినేవారిని దూషించడమే కాకుండా.. వీరి నుంచి రామమందిర నిర్మాణానికి చందాలు తీసుకోవద్దన్నారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహించిన దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

ఇదీ చూడండి: ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ సరికాదు: వీహెచ్‌

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ... మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట బస్​స్టాండ్ వద్ద దళితులు ఆందోళనకు దిగారు. దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. దళితులకు రాజాసింగ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తమకు క్షమాపణ చెప్పకపోతే పార్టీ నుంచి రాజాసింగ్​ను సస్పెండ్ చేయాలని పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్​ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టడానికైనా వెనుకాడబోమని వారు హెచ్చరించారు.

ఇటీవల ఓ సందర్భంలో రాజాసింగ్ గోమాంసం తినేవారిని దూషించడమే కాకుండా.. వీరి నుంచి రామమందిర నిర్మాణానికి చందాలు తీసుకోవద్దన్నారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహించిన దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

ఇదీ చూడండి: ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ సరికాదు: వీహెచ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.