ETV Bharat / state

మేడ్చల్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్​ నియామకం - telangana varthalu

మేడ్చల్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్​ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్​ నియమించారు. తనను నియమించినందుకు ఆయన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.

మేడ్చల్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్​ నియామకం
మేడ్చల్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్​ నియామకం
author img

By

Published : Mar 4, 2021, 10:41 PM IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్ నియామకమయ్యారు. ఇటీవల మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ డీసీసీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే దిల్లీ వెళ్లి భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ తీర్థం తీసుకున్నారు.

దీనితో మేడ్చల్ జిల్లా డీసీసీ నూతన అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్​ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమించారు. తనపై నమ్మకంతో డీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపై పార్టీ అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులకి కృతజ్ఞతలు తెలియజేశారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్ నియామకమయ్యారు. ఇటీవల మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ డీసీసీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే దిల్లీ వెళ్లి భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ తీర్థం తీసుకున్నారు.

దీనితో మేడ్చల్ జిల్లా డీసీసీ నూతన అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్​ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమించారు. తనపై నమ్మకంతో డీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపై పార్టీ అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి: ఆదివారాల్లో పనిచేయనున్న సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.