గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే ఉండడం వల్ల కాంగ్రెస్ తన ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసింది. అందులో భాగంగా జీడీమెట్ల డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి బండి లలిత తరుపున ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
గాజుల రామారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. కట్టమైసమ్మ బస్తీలో పాల్గొన్న ఆయన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని పేర్కొన్నారు. ప్రస్తుత నాయకులు సామాన్య ప్రజలను బెదిరించి వసూళ్లు చేయడం తప్ప, ప్రజలకు సేవ చేయడం మర్చిపోయారని అన్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
సుభాష్నగర్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్ధి తానం శ్రావణికి మద్దతుగా ఓ చికెన్ దుకాణదారుడు 1000 మంది కాంగ్రెస్కి ఓటు వేస్తే వారికి 25% డిస్కౌంట్ ఇస్తానని ప్రకటించాడు.
ఇదీ చూడండి : నీచ రాజకీయాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: రేవంత్ రెడ్డి