ETV Bharat / state

వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేత - medchal district latest news

భారీ వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకున్న ఉమామహేశ్వర కాలనీ ప్రజలకు ఎమ్మెల్యే వివేక్​, ఎమ్మెల్సీ రాజు ఆర్థిక సాయం అందజేశారు. సీఎం సహాయనిధి కింద బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు అందించారు.

MLA provided financial assistance to flood victims
వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేత
author img

By

Published : Oct 20, 2020, 3:56 PM IST

భారీ వర్షాల కారణంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉమామహేశ్వర కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. సుమారు 6 వందల కుటుంబాలు ఇళ్లను వదిలి.. బయట నివసిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాళ్లలో ఉంటున్నారు. ఈ క్రమంలో కొంపల్లిలోని మల్టీపర్పస్​ ఫంక్షన్​ హాల్లో కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే వివేక్​, ఎమ్మెల్సీ రాజు వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున చెక్కులను అందజేశారు.

వరద బాధితులు అధైర్యపడొద్దని.. ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని నేతలు పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

భారీ వర్షాల కారణంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉమామహేశ్వర కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. సుమారు 6 వందల కుటుంబాలు ఇళ్లను వదిలి.. బయట నివసిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాళ్లలో ఉంటున్నారు. ఈ క్రమంలో కొంపల్లిలోని మల్టీపర్పస్​ ఫంక్షన్​ హాల్లో కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే వివేక్​, ఎమ్మెల్సీ రాజు వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున చెక్కులను అందజేశారు.

వరద బాధితులు అధైర్యపడొద్దని.. ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని నేతలు పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.