మేడ్చల్ జిల్లాలోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ ఉప్పల్ నల్లచెరువు - పీర్జాదిగూడ మధ్య మిస్సింగ్ లింక్ రోడ్డును నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులను మంత్రి మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్లు పరిశీలించారు. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్య ఏ మేర పరిష్కారం అవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడువులోగా పనులు పూర్తయ్యే విధంగా చూడాలని మంత్రి మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్లు అధికారులకు సూచించారు. వారి వెంట పీర్జాదిగూడ, బోడుప్పల్ నగర పాలక మేయర్లు జక్కా వెంకట్ రెడ్డి, బుచ్చిరెడ్డిలు ఉన్నారు.