హైదరాబాద్ కూకట్పల్లిలో జంగిల్ బుక్ పార్క్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. కైతలపూర్లో రూ.25 లక్షలతో నిర్మిస్తున్న ఈ పార్కు పనులు శరవేగంగా సాగుతున్నాయి.
బెంగళూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన కళాకారులు పార్కులో బొమ్మలు, పెయింటింగ్స్ వేశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ జంగిల్ బుక్ పార్కు పిల్లలకు అందుబాటులోకి రానుందని నిర్వాహకులు తెలిపారు.
వివిధ రకాల జంతువుల చిత్రాలు, బొమ్మలతోపాటు... రంగురంగుల పూల పెయింటింగ్స్ పిల్లలకు ఆకర్షణీయంగా ఉంటాయని చెబుతున్నారు. ఇందులోకి వెళ్లిన పిల్లలు మంచి అనుభూతిని పొందుతారని నిర్వాహకులు తెలిపారు.
ఇవీచూడండి: అద్భుత సూక్ష్మ కళ.. యోగాను ప్రతిబింబించే అతి చిన్న విగ్రహం