వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం కావడంతో మేడ్చల్ జిల్లా సూరారం సబ్రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారని.. అందువల్ల రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. పాత పద్ధతినే కొనసాగించాలని నిరసన చేపట్టారు. 'ధరణి వద్దు, సీఏఆర్డీ ముద్దు' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
"కొత్త పద్ధతి ద్వారా ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేకుండానే పూర్తిగా వినియోగదారులకు సులభంగా ఉంది. ప్రస్తుతం సేల్, గిఫ్ట్, మార్టగేజ్.. ఈ మూడు సర్వీస్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అతి త్వరలో పూర్తిసేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్త పద్ధతి ద్వారా తప్పనిసరిగా పీటీఎన్ నంబర్ ఉంటేనే స్లాట్ బుక్ అవుతుంది."
-జ్యోతి, సబ్ రిజిస్ట్రార్
ఇదీ చూడండి: 'ఆమె ఓడిపోయినా... ఇంటింటికెళ్లి సమస్యలు తెలుసుకుంది'