మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్స్టేషన్లో క్రిమిసంహారక టన్నెల్ను ఏర్పాటు చేశారు. పీఎస్కు వచ్చిపోయే వారు, సిబ్బంది కోసం డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ను పెట్టినట్లు పోలీసులు తెలిపారు. పది సెకన్లపాటు ఇందులో నుంచి నడిస్తే శరీరం మొత్తం శానిటైజ్ అయ్యి క్రిముల నుంచి విముక్తి కలుగుతుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పోలీసులు ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండిః 'జూమ్' యాప్ ఎందుకు సురక్షితం కాదంటే...!