ETV Bharat / state

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసులో ముగిసిన నిందితుల కస్టడీ - నాలుగు రోజులపాటు కొనసాగిన విచారణ

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులకు పోలీసుల కస్టడీ ముగిసింది. నాలుగు రోజులపాటు నిందితులను విచారించిన పోలీసులు ఇవాళ మేడ్చల్ కోర్టులో హాజరు పరిచారు. ఏడుగురికి 14 రోజుల రిమాండ్ కోర్టు విధించింది.

Custody of accused ends in conspiracy case
ముగిసిన పోలీసుల కస్టడీ
author img

By

Published : Mar 12, 2022, 9:54 PM IST

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితుల నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. అనంతరం నిందితులని న్యాయస్థానంలో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. నాలుగు రోజుల కస్టడీలో నిందితుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రిని హత్య ఎందుకు చేయాలనుకున్నారు? తుపాకులు ఎవరు సమకూర్చారు..? వారికి రూ.15 కోట్ల సుపారి నగదు ఎవరిచ్చారు? అనే కోణాల్లో పోలీసులు విచారించారు.

విచారణ వీడియో తీయాలని కోర్టు ఆదేశం

కస్టడీలో భాగంగా విచారణ సమయంలో నిందితులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని, విచారణ మొత్తం వీడియోగ్రఫీ చేయాలని కోర్టు ఆదేశించింది. అడ్వకేట్ సమక్షంలో నిందితులను విచారించాలని కోర్టు ఆదేశించడంతో విచారణ సమయంలో నిందితుల నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని సమాచారం.
ఇదీ చూడండి:

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితుల నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. అనంతరం నిందితులని న్యాయస్థానంలో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. నాలుగు రోజుల కస్టడీలో నిందితుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రిని హత్య ఎందుకు చేయాలనుకున్నారు? తుపాకులు ఎవరు సమకూర్చారు..? వారికి రూ.15 కోట్ల సుపారి నగదు ఎవరిచ్చారు? అనే కోణాల్లో పోలీసులు విచారించారు.

విచారణ వీడియో తీయాలని కోర్టు ఆదేశం

కస్టడీలో భాగంగా విచారణ సమయంలో నిందితులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని, విచారణ మొత్తం వీడియోగ్రఫీ చేయాలని కోర్టు ఆదేశించింది. అడ్వకేట్ సమక్షంలో నిందితులను విచారించాలని కోర్టు ఆదేశించడంతో విచారణ సమయంలో నిందితుల నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని సమాచారం.
ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.