హైదరాబాద్ రామంతాపూర్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఓ కాలనీలో కిరాణా దుకాణదారునికి కరోనా పాజిటివ్ తేలగా కాలనీవాసులంతా భయాందోళనకు గురవుతున్నారు.
కొవిడ్-19 సోకిన వ్యక్తి నివాసమున్న కాలనీని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కృష్ణశేఖర్, కీసర డివిజన్ ఆరోగ్య అధికారి నారాయణరావు, ఉప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ రంగస్వామి సందర్శించారు. ఆ కాలనీలో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేయించి, రాకపోకలు నిలిపివేశారు.