పోలింగ్ కేంద్రానికి తెరాస కార్యకర్తలు గులాబీ రంగు చొక్కాలు ధరించి రావటంపై.. భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న అనంతరం.. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగింది.
పార్టీ రంగు చొక్కా వేసుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చిన తెరాస కార్యకర్తలను.. కమలం నేతలు అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు.. అందరిని అక్కడినుంచి పంపివేశారు.
ఇదీ చదవండి: ఓటర్లకు డబ్బుల పంపిణీ!.. వైరల్ అయిన వీడియో