నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొనసాగుతోంది. కాప్రా సర్కిల్, ఈసీఐఎల్ చౌరస్తాలో సీపీఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఆ చట్టాలను రద్దు చేయాలని 150 రోజుల నుంచి రైతులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా ప్రధాని మోదీ పాలన ఉందని ఆరోపించారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి.. స్టేషన్కి తరలించారు.
ఇదీ చదవండి: 'సాగు కూలీలకూ రైతు బీమా వర్తింపుపై నిర్ణయం తీసుకుంటాం'