సూర్యాపేట జిల్లా నడికుడి వద్ద సాగర్ ఎడమ కాలువలో పడి ఆరుగురు వ్యక్తుల మృతిపై వారి సహోద్యోగులు విచారం వ్యక్తం చేశారు. కుషాయిగూడ ఏఎస్రావ్ నగర్లోని అంకుర ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం సాగర్ కాలువలో పడిపోయిన విషయం తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కారును వెలికి తీయగా ఆరుగురి మృతదేహాలు బయటపడ్డాయి. ఒకే చోట పనిచేస్తున్న వారంతా మృతిచెందడంపై తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సహోద్యోగి వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చూడండి: సాగర్లో నుంచి కారును వెలికితీసిన అధికారులు