మేడ్చల్ జిల్లా జవహార్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆసరా ఫించన్ల కోసం వృద్ధులు, వితంతువులు బారులు తీరారు. భౌతిక దూరం పాటించకుండా లైన్లో నిలుచున్నారు. అక్కడ వారికి చెప్పడానికి అధికారులు, పోలీసులు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ దాదాపు 200 మంది భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. ఇందులో ఒక్కరి కొవిడ్ ఉన్నా వారందరికీ వచ్చే ప్రమాదం ఉంది.
ఇదీ చదవండి: ప్రాణాన్ని బలిగొన్న.. ఫార్వర్డ్ సందేశం