ETV Bharat / state

'ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనమే లక్ష్యం'

రాష్ట్రంలో ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. మెదక్​ జిల్లా టీఎన్జీవో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరై డైరీ, క్యాలెండర్​ను ఆవిష్కరించారు.

author img

By

Published : Jan 19, 2021, 1:57 PM IST

tngo-president-mamilla-rajender
టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. ఉద్యోగ సంఘాల సమస్యలపై సీఎం కేసీఆర్​తో చర్చలు జరిపి పరిష్కారానికి కృషి చేశామని వెల్లడించారు. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ పెంచాలని, ఉద్యోగులకు రావాల్సిన అన్ని ప్రయోజనాలు కల్పించాలని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు చెప్పారు. ఈ నెల 31లోగా పదోన్నతులు కల్పించడమే గాక సమస్యలు పరిష్కరిస్తానని సీఎం మాటిచ్చినట్లు పేర్కొన్నారు.

మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవన్​లో మెదక్​ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాజేందర్ హాజరయ్యారు. టీఎన్జీవో నూతన డైరీ, క్యాలెండర్​ను ఆవిష్కరించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మకుండా ముఖ్యమంత్రి కేసీఆర్​పై నమ్మకముంచాలని రాజేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన టీఎన్జీవో జిల్లా మాజీ అధ్యక్షుడు శ్యామ్​రావు దంపతులను ఘనంగా సన్మానించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. ఉద్యోగ సంఘాల సమస్యలపై సీఎం కేసీఆర్​తో చర్చలు జరిపి పరిష్కారానికి కృషి చేశామని వెల్లడించారు. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ పెంచాలని, ఉద్యోగులకు రావాల్సిన అన్ని ప్రయోజనాలు కల్పించాలని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు చెప్పారు. ఈ నెల 31లోగా పదోన్నతులు కల్పించడమే గాక సమస్యలు పరిష్కరిస్తానని సీఎం మాటిచ్చినట్లు పేర్కొన్నారు.

మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవన్​లో మెదక్​ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాజేందర్ హాజరయ్యారు. టీఎన్జీవో నూతన డైరీ, క్యాలెండర్​ను ఆవిష్కరించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మకుండా ముఖ్యమంత్రి కేసీఆర్​పై నమ్మకముంచాలని రాజేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన టీఎన్జీవో జిల్లా మాజీ అధ్యక్షుడు శ్యామ్​రావు దంపతులను ఘనంగా సన్మానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.