ETV Bharat / state

లైవ్​ వీడియో: రాందాస్​ చౌరస్తాలో లారీ కిందపడి వ్యక్తి దుర్మరణం - lorry hits bike in medak town

మెదక్​ పట్టణంలోని రాందాస్​ చౌరస్తాలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వెల్దుర్తి మండలం బండపోసానిపల్లికి చెందిన దాసు అక్కడిక్కడే మరణించాడు.

road accident at medak town near ramdas center one man died
రాందాస్​ చౌరస్తాలో ప్రమాదం.. ఒకరు దుర్మరణం
author img

By

Published : Dec 17, 2019, 8:04 PM IST

మెదక్​ పట్టణంలోని రాందాస్​ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు వెల్దుర్తి మండలం బండ పోసానిపల్లికి చెందిన దాసుగా పోలీసులు గుర్తించారు.

రహదారి నిర్మాణ గుత్తేదారు నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాందాస్​ చౌరస్తాలో రెండు నెలలుగా పనులు చేస్తున్నా.. కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయలేదని తెలిపారు. పనుల కారణంగా రహదారి గుంతలుగా మారినా.. పనుల్లో వేగం పెంచలేదన్నారు. ఫలితంగా ఆ ప్రాంతం ప్రమాదాలకు కేరాఫ్​గా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

రాందాస్​ చౌరస్తాలో ప్రమాదం.. ఒకరు దుర్మరణం

ఇవీచూడండి: ప్రాణం తీసిన స్థిరాస్తి వ్యాపారం
..

మెదక్​ పట్టణంలోని రాందాస్​ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు వెల్దుర్తి మండలం బండ పోసానిపల్లికి చెందిన దాసుగా పోలీసులు గుర్తించారు.

రహదారి నిర్మాణ గుత్తేదారు నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాందాస్​ చౌరస్తాలో రెండు నెలలుగా పనులు చేస్తున్నా.. కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయలేదని తెలిపారు. పనుల కారణంగా రహదారి గుంతలుగా మారినా.. పనుల్లో వేగం పెంచలేదన్నారు. ఫలితంగా ఆ ప్రాంతం ప్రమాదాలకు కేరాఫ్​గా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

రాందాస్​ చౌరస్తాలో ప్రమాదం.. ఒకరు దుర్మరణం

ఇవీచూడండి: ప్రాణం తీసిన స్థిరాస్తి వ్యాపారం
..

TG_SRD_43_17_ACCDENT_SCRIPCT_TS10115.. రిపోర్టర్. శేఖర్. మెదక్..9000302217.. కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైన సంఘటన జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా లో చోటుచేసుకుంది... ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా పట్టణంలోని చౌరస్తాలో భారీ కల్వర్టు నిర్మిస్తున్నారు దాదాపుగా రెండు నెలలుగా పనులు కొనసాగుతున్నాయి.. వర్షం పడ్డప్పుడు ఇక్కడ పెద్ద మొత్తంలో నీరు నిలిచి ఉండటం తో నీరు వెళ్లేందుకు పెద్ద కల్వర్టులు నిర్మిస్తున్నారు. దాదాపుగా రెండు నెలలుగా కల్వర్టు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి .. ప్రధాన రహదారిపై పెద గోతి తవ్వి పనులు చేస్తుండటంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.. పనులు చేసే చోట అధికారులు కాంట్రాక్టర్ ఎలాంటి హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయలేదు . ఈ నేపథ్యంలో. వ్యక్తిగత పనికోసం మెదక్ పట్టణానికి వచ్చిన వెల్దుర్తి మండలం బండ పోసాని పల్లి కి చెందిన దాసు తన ద్విచక్రవాహనంపై రాందాస్ చౌరస్తా మీదుగా వెళ్తుండగా కల్వర్టు నిర్మించే చోట లారీ ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.. ఈ సంఘటనపై స్థానికులు కాంట్రాక్టర్లు అధికారులు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.