ETV Bharat / state

అన్నార్తుల ఆకలి తీరుస్తున్న పోలీస్​..

author img

By

Published : May 30, 2020, 4:12 PM IST

వృత్తిలో కాఠిన్యత ఉన్నా.. తన లోపల సేవాభావం ఉందని నిరూపిస్తున్నాడో పోలీస్ ఆఫీసర్​. సేవే లక్ష్యంగా వందలాది మంది అన్నార్తుల ఆకలి తీర్చి శభాష్ పోలీస్ అనిపించుకుంటున్నాడు. లాక్​డౌన్ నేపథ్యంలో ఎవరూ పస్తులు ఉండొద్దనే దృఢ సంకల్పంతో 'సంకల్ప్ ఫౌండేషన్' స్థాపించి వందలాది మంది నిరుపేదల పాలిట అన్నదాతగా మారిన ఓ పోలీస్ ఆఫీసర్​పై ప్రత్యేక కథనం.

police officer help to people in medak district
సేవే లక్ష్యంగా అన్నార్తుల ఆకలి తీరుస్తున్న పోలీస్​..

మెదక్ జిల్లా రామాయంపేట సర్కిల్ ఇన్​స్పెక్టర్​గా పని చేస్తున్న నాగార్జున గౌడ్ వృత్తిపరంగా కఠినంగా ఉన్నా నిరుపేదలు, అన్నార్తులు, నిరాశ్రయులు, వలస కార్మికుల పాలిట అన్నదాతగా మారాడు. లాక్​డౌన్ విధించిన కొత్తలో వృత్తిలో భాగంగా పెట్రోలింగ్​కి వెళ్లిన నాగార్జున గౌడ్​కు నెత్తిన మూటలతో చంకలో పసిబిడ్డలతో వెళ్తున్న కార్మికులను చూసి చలించిపోయారు. వారు 2 రోజులుగా అన్నం తినలేదని చెప్పడం వల్ల నాగార్జున గౌడ్ వెనువెంటనే వారందరికీ పాలు బ్రెడ్ తెప్పించారు. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారు. తన సర్కిల్ పరిధిలో ఎవరు ఆహారం లేకుండా పస్తులతో ఉండరాదని సంకల్ప్ ఫౌండేషన్​ను స్థాపించాడు. 20 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు.

6మండలాల్లో 2వేల మంది నిరుపేదలకు వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరకులు అందించారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వలస కార్మికులకు గత 50 రోజులుగా ఆహారం అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల కోసం ఎందరో దాతలు తమ సహాయం అందించారు. ఈ పోలీసు అధికారి చేస్తున్న సేవలను తెలంగాణ డీజీపీ కూడా ట్విట్టర్​లో అభినందించారు. శభాష్ పోలీస్ అని ప్రజలంతా చేతులెత్తి నమస్కరిస్తున్నారు.

మెదక్ జిల్లా రామాయంపేట సర్కిల్ ఇన్​స్పెక్టర్​గా పని చేస్తున్న నాగార్జున గౌడ్ వృత్తిపరంగా కఠినంగా ఉన్నా నిరుపేదలు, అన్నార్తులు, నిరాశ్రయులు, వలస కార్మికుల పాలిట అన్నదాతగా మారాడు. లాక్​డౌన్ విధించిన కొత్తలో వృత్తిలో భాగంగా పెట్రోలింగ్​కి వెళ్లిన నాగార్జున గౌడ్​కు నెత్తిన మూటలతో చంకలో పసిబిడ్డలతో వెళ్తున్న కార్మికులను చూసి చలించిపోయారు. వారు 2 రోజులుగా అన్నం తినలేదని చెప్పడం వల్ల నాగార్జున గౌడ్ వెనువెంటనే వారందరికీ పాలు బ్రెడ్ తెప్పించారు. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారు. తన సర్కిల్ పరిధిలో ఎవరు ఆహారం లేకుండా పస్తులతో ఉండరాదని సంకల్ప్ ఫౌండేషన్​ను స్థాపించాడు. 20 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు.

6మండలాల్లో 2వేల మంది నిరుపేదలకు వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరకులు అందించారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వలస కార్మికులకు గత 50 రోజులుగా ఆహారం అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల కోసం ఎందరో దాతలు తమ సహాయం అందించారు. ఈ పోలీసు అధికారి చేస్తున్న సేవలను తెలంగాణ డీజీపీ కూడా ట్విట్టర్​లో అభినందించారు. శభాష్ పోలీస్ అని ప్రజలంతా చేతులెత్తి నమస్కరిస్తున్నారు.

ఇవీ చూడండి: 'నియంత్రిత సాగు విధానం కాదు.. నిర్బంధ సాగు విధానమే..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.