సార్వత్రిక విద్యలో ఉత్తీర్ణులైన వారు రెగ్యులర్ విద్యార్థులతో సమానమని మెదక్ జిల్లా సార్వత్రిక విద్య పాఠశాల సమన్వయకర్త వెంకటస్వామి అన్నారు. ప్రవేశాల ప్రగతిలో భాగంగా నర్సాపూర్ బాలుర ఉన్నత పాఠశాలలో గోడపత్రికను ఆవిష్కరించారు. ప్రవేశాలు పొందేందుకు ఈ నెల 15 వరకు అవకాశం ఉందని తెలిపారు.
సార్వత్రికంగా పదవ తరగతి, ఇంటర్లలో ఉత్తీర్ణులైన వారికి... పైచదువులు, ఉపాధి అవకాశాలు, పదోన్నతుల్లో రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని మధ్యలో బడి మానేసిన వారందరూ వినియోగించుకోవాని అన్నారు. ఆగిపోయిన చదువులను కొనసాగించి... బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: సంక్షేమ పథకాల అమలులో భేష్ : పల్లా రాజేశ్వర్ రెడ్డి