మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ బృందం రెండో రోజు సందర్శించింది. వైస్ ఛాన్స్లర్ వర్మ, ప్రొఫెసర్లు కళాశాలలోని వసతులను పరిశీలించారు. రెండు రోజుల సందర్శనలో భాగంగా వారు తొలిరోజు కళాశాల ప్రిన్సిపాల్ పీవీ నరసింహ పవర్ పాయింట్ ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం కళాశాలకు సంబంధించిన రికార్డులను, కాలేజీలో పాసైన విద్యార్థుల వివరాలను పరిశీలించారు.
కళాశాలలోని ల్యాబ్లు, పార్కింగ్ ప్లేస్, క్యాంటీన్, కాలేజీ ఆవరణలో గల ఇంకుడు గుంతలను, హరితహారంలో నాటిన మొక్కలను న్యాక్ బృందం పరిశీలించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నరసింహ తెలిపారు. లెక్చరర్ల అర్హతలను కూడా పరిశీలించినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా న్యాక్ గ్రేడ్ కేటాయిస్తారని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: తెలంగాణ వార్షిక బడ్జెట్లో నిరుద్యోగ భృతి అంశం..!