ETV Bharat / state

'తెలంగాణకు మాటలు.. గుజరాత్​కు మాత్రం మూటలు'

author img

By

Published : Jun 8, 2022, 8:27 PM IST

Minister Harish Rao Comments: తెలంగాణకు మాటలు.. గుజరాత్​కు మూటలు అన్న చందంగా కేంద్రం తీరు ఉందని ఆర్థిక మంత్రి హరీశ్​రావు విమర్శించారు. రాష్ట్రం సిద్ధించాక మొట్టమొదటి ఆర్టీసీ డిపోను మెదక్ జిల్లాలో రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్​తో కలిసి హరీశ్​రావు ప్రారంభించారు. డబుల్ ఇంజిన్ అని భాజపా గొప్పలు చెబుతున్నా.. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు మాత్రం ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో లేవని హరీశ్​రావు ఎద్దేవా చేశారు.

minister harish rao fire on central government
minister harish rao fire on central government

Minister Harish Rao Comments: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఆర్టీసీ డిపోను మెదక్ జిల్లా నర్సాపూర్​లో ఏర్పాటు చేశారు. డిపోను మంత్రులు హరీశ్​రావు, అజయ్ కుమార్ ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో నర్సాపూర్​లో బస్ డిపో ఏర్పాటుపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని మంత్రి అజయ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం వల్ల తెలంగాణలో మొట్టమొదటి ఆర్టీసీ డిపో నర్సాపూర్​కు వచ్చిందని పేర్కొన్నారు. డిపోకు కావల్సినన్ని బస్సులు కేటాయిస్తామని మంత్రి హమీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని.. వాటిని ఆదరించి సంస్థను కాపాడుకోవాలని మంత్రి హరీశ్​రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

minister harish rao fire on central government
నర్సాపూర్​ డిపోను ప్రారంభిస్తోన్న నేతలు

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ప్రజాసంక్షేమం, శ్రేయస్సును విస్మరించి.. వ్యాపార ధోరణితో పరిపాలన చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేస్తోందని.. రైల్వేలు, రైల్వేస్టేషన్లు, విశాఖ ఉక్కు వంటి సంస్థలను అమ్మకానికి పెట్టారని హరీశ్​రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ సంస్థలను అమ్మితే.. 2,000 కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్రం బహుమానం ప్రకటించిందన్నారు. డబుల్ ఇంజిన్ అభివృద్ధి చెప్పే భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణాలో అమలవుతున్న పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.

"కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోంది. విభజ చట్టంలోని హమీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన కోచ్ ఫ్యాక్టరీని.. గుజరాత్​కు తరలించారు. హైదరాబాద్​లో పెడతామన్న గ్లోబల్ ట్రెడిషనల్ హెల్త్ సెంటర్​ను కూడా గుజరాత్​కు తీసుకుపోయారు. ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు.. నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోంది." -హరీశ్ రావు, మంత్రి

ఇవీ చదవండి:

Minister Harish Rao Comments: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఆర్టీసీ డిపోను మెదక్ జిల్లా నర్సాపూర్​లో ఏర్పాటు చేశారు. డిపోను మంత్రులు హరీశ్​రావు, అజయ్ కుమార్ ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో నర్సాపూర్​లో బస్ డిపో ఏర్పాటుపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని మంత్రి అజయ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం వల్ల తెలంగాణలో మొట్టమొదటి ఆర్టీసీ డిపో నర్సాపూర్​కు వచ్చిందని పేర్కొన్నారు. డిపోకు కావల్సినన్ని బస్సులు కేటాయిస్తామని మంత్రి హమీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని.. వాటిని ఆదరించి సంస్థను కాపాడుకోవాలని మంత్రి హరీశ్​రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

minister harish rao fire on central government
నర్సాపూర్​ డిపోను ప్రారంభిస్తోన్న నేతలు

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ప్రజాసంక్షేమం, శ్రేయస్సును విస్మరించి.. వ్యాపార ధోరణితో పరిపాలన చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేస్తోందని.. రైల్వేలు, రైల్వేస్టేషన్లు, విశాఖ ఉక్కు వంటి సంస్థలను అమ్మకానికి పెట్టారని హరీశ్​రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ సంస్థలను అమ్మితే.. 2,000 కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్రం బహుమానం ప్రకటించిందన్నారు. డబుల్ ఇంజిన్ అభివృద్ధి చెప్పే భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణాలో అమలవుతున్న పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.

"కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోంది. విభజ చట్టంలోని హమీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన కోచ్ ఫ్యాక్టరీని.. గుజరాత్​కు తరలించారు. హైదరాబాద్​లో పెడతామన్న గ్లోబల్ ట్రెడిషనల్ హెల్త్ సెంటర్​ను కూడా గుజరాత్​కు తీసుకుపోయారు. ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు.. నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోంది." -హరీశ్ రావు, మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.