ETV Bharat / state

నిరుపేదలకు నిత్యావసర సరకులు అందజేసిన మంత్రి హరీశ్​

author img

By

Published : Apr 27, 2020, 10:23 PM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​ నియోజకవర్గ పరిధిలోని కౌడిపల్లి, నర్సాపూర్​లలో మంత్రి హరీశ్​ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని సూచించారు.

minister harish rao distributed groceries in medak district
నిరుపేదలకు నిత్యావసర సరకులు అందజేసిన మంత్రి హరీశ్​

కరోనా వ్యాధికి మందు వచ్చే వరకు ప్రభుత్వం చెప్పిన నిబంధనలు పాటించాలని మంత్రి హరీశ్​రావు అన్నారు. మెదక్​ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కౌడిపల్లి, నర్సాపూర్​లలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వైరస్​ కట్టడి కోసం భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు.

వైరస్​ సోకిన వ్యక్తి మరణిస్తే కుటుంబ సభ్యులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. చివరి చూపు కూడా దక్కదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి పెన్షన్లు, ప్రతినెలా బియ్యం, నగదు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్ పాల్గొన్నారు.

కరోనా వ్యాధికి మందు వచ్చే వరకు ప్రభుత్వం చెప్పిన నిబంధనలు పాటించాలని మంత్రి హరీశ్​రావు అన్నారు. మెదక్​ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కౌడిపల్లి, నర్సాపూర్​లలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వైరస్​ కట్టడి కోసం భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు.

వైరస్​ సోకిన వ్యక్తి మరణిస్తే కుటుంబ సభ్యులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. చివరి చూపు కూడా దక్కదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి పెన్షన్లు, ప్రతినెలా బియ్యం, నగదు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఉపాధి హామీ కూలీల వేతనం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.