కరోనా కట్టడికి మెదక్ జిల్లాలో లాక్డౌన్ను పటిష్ఠంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ చందన దీప్తి తెలిపారు. డ్రోన్ల సాయంతో లాక్డౌన్ అమలును పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి దీనికి సహకరించాలని కోరారు.
లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలు సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 752 వాహనాలు జప్తు చేసినట్లు చెప్పారు.
- ఇదీ చదవండి: హైవే కిల్లర్ మున్నా కేసులో 12 మందికి ఉరిశిక్ష