ETV Bharat / state

విద్యార్థి కాలర్​ పట్టుకుని చెంపపై కొట్టి...

విద్యార్థులందరూ ప్రశాంతంగా పరీక్ష రాస్తున్నారు. ఒక విద్యార్థి కాపీ కొడుతున్నట్లు భావించిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఏం చేయాలి? డిబార్ అయినా చేయాలి లేదా అతడిని పరీక్ష రాయకుండా పంపిచేయాలి. ఈ అధికారిణి మాత్రం విద్యార్థిని కొట్టి తన కోపాన్ని ప్రదర్శించారు.

author img

By

Published : Mar 12, 2019, 9:36 PM IST

వీళ్లు కూడా కొడతారా...?
వీళ్లు కూడా కొడతారా...?
మెదక్ జిల్లా కౌడిపల్లి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని స్క్వాడ్ కొట్టారంటూ... సహచర విద్యార్థులు ధర్నా చేశారు. కాపీయింగ్​కు పాల్పడ్డాడని పర్యవేక్షణాధికారిణి కాలర్​ పట్టుకుని కొట్టారని తెలిపారు. ఎందుకు కొడుతున్నారని అడిగినా... వినిపించుకోలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారమంతా పరీక్షకేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది.

విద్యార్థి ఆత్మహత్యాయత్నం

మనస్తాపంతో ఆ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నా చేశారు. ప్రైవేట్​ పాఠశాల పరీక్షా కేంద్రాలకు వెళ్లకుండా ఇక్కడికే వస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు పోలీసులు సముదాయించి ఆందోళన విరమింపజేశారు.
కాపీ చేస్తే డిబార్​ చేయాలని... కొట్టడం ఏంటని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని కొట్టిన విషయం తమదృష్టికి రాలేదని ఎస్సై తెలిపారు. ఫిర్యాదు వస్తే విచారణ చేపడుతామని చెప్పారు.

ఇవీ చూడండి:కేసీఆర్ దేశానికి దిక్సూచి

వీళ్లు కూడా కొడతారా...?
మెదక్ జిల్లా కౌడిపల్లి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థిని స్క్వాడ్ కొట్టారంటూ... సహచర విద్యార్థులు ధర్నా చేశారు. కాపీయింగ్​కు పాల్పడ్డాడని పర్యవేక్షణాధికారిణి కాలర్​ పట్టుకుని కొట్టారని తెలిపారు. ఎందుకు కొడుతున్నారని అడిగినా... వినిపించుకోలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారమంతా పరీక్షకేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది.

విద్యార్థి ఆత్మహత్యాయత్నం

మనస్తాపంతో ఆ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరీక్షలు ముగిసిన అనంతరం విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నా చేశారు. ప్రైవేట్​ పాఠశాల పరీక్షా కేంద్రాలకు వెళ్లకుండా ఇక్కడికే వస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు పోలీసులు సముదాయించి ఆందోళన విరమింపజేశారు.
కాపీ చేస్తే డిబార్​ చేయాలని... కొట్టడం ఏంటని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని కొట్టిన విషయం తమదృష్టికి రాలేదని ఎస్సై తెలిపారు. ఫిర్యాదు వస్తే విచారణ చేపడుతామని చెప్పారు.

ఇవీ చూడండి:కేసీఆర్ దేశానికి దిక్సూచి

Intro:ఫైల్: TG_KRN_41_12_ACB TRAP_AVB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం అనుదీప్ కానీ రైతు వద్ద 30 వేలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి సబ్ రిజిస్టర్ దిలీప్, డాక్యుమెంటరీ రైటర్ వెంకట్ ఏసీబీకి పట్టుబడ్డారు. మంచిర్యాలకు చెందిన అనుదీప్ అనే రైతు పెద్దపల్లి జిల్లా లోని ముంజంపల్లి వద్ద తనకున్న రెండు ఎకరాల 25 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చాడు. దీంతో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటే 50 వేలు లంచం కావాలని అని అధికారులు అడిగినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇవాళ రిజిస్టర్ ఆఫీస్ లోని డాక్యుమెంటరీ రైటర్ వెంకట్ 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సబ్ రిజిస్టర్ దిలీప్ డాక్యుమెంటరీ రైటర్ వెంకట్ ద్వారా లంచం ఆశించినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం రిజిస్టర్ కార్యాలయం లో లో రెండు గంటల విచారణ అనంతరం ఇద్దరు అధికారులను ఏసీబీ సిబ్బంది అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
బైట్: బద్రయ్య, ఏసీబీ, డీఎస్పీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా


Body:లక్ష్మణ్


Conclusion:పెద్దపల్లి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.