మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడులో ఓ మహిళ కరోనాతో ప్రాణాలు కోల్పోయింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి సహకరించి.. ఏర్పాట్లు చేసిన ఏడుగురికి కూడా కరోనా వచ్చిందన్న అనుమానంతో వారిని గ్రామ శివారులోని ప్రభుత్వ పాఠశాల గదిలో ఐసోలేషన్లో ఉంచారు. గ్రామ రెవెన్యూ సహాయకుడు దుబ్బగాళ్ల స్వామి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. ఈ పరిస్థితుల్లో అతనికి చికిత్స అందించడానికి ఎవరూ ముందుకు రాలేదు.
గత రెండు రోజులుగా వారికి సరైన ఆహారం కూడా ఇవ్వడం లేదని, గ్రామ పెద్దలు, వైద్యసిబ్బంది ఎవరూ తమను పట్టించుకోవడం లేదని ఐసోలేషన్లో ఉన్న ఏడుగురు వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలో ఒకరు అస్వస్థతకు గురికావడం వల్ల తమకు కూడా ఏమవుతుందోనని ఆందోళన పడుతున్నారు. అధికారులు స్పందించి తమకు సరైన ఆహారం అందించాలని, పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!