ETV Bharat / state

'అధికారంలోకి వచ్చి ఆరేళ్లవుతున్నా ఆరు ఇళ్లు కూడా ఇవ్వలేదు' - మెదక్​ జిల్లా వార్తలు

ఎల్​ఆర్​ఎస్​ను నిరసిస్తూ మెదక్​ కలెక్టరేట్​ ఎదుట భాజాపా నిరసన చేపట్టింది. పేదలకు డబుల్ బెడ్​రూమ్​ ఇళ్లు ఇస్తామని చెప్పిన తెరాస.. అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అవుతున్నా ఆరు ఇళ్లు కూడా ఇవ్వలేదని జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మండిపడ్డారు. ఎల్​ఆర్​ఎస్​ పేరుతో పేదలనుంచి డబ్బులు వసూలు చేయడాన్ని ఆపేంత వరకు భాజపా ఉద్యమిస్తూనే ఉంటుందన్నారు.

bjp leaders protest against LRS at medak collectorate
'అధికారంలోకి వచ్చి ఆరేళ్లవుతున్నా ఆరు ఇళ్లు కూడా ఇవ్వలేదు'
author img

By

Published : Oct 3, 2020, 3:37 PM IST

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం.. ఎల్​ఆర్​ఎస్​ పేరిట నిరుపేదల రక్తాన్ని పీల్చబోతుందని మెదక్​ జిల్లా భాజాపా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్​ ఆరోపించారు. ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలంటూ మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కమలం నేతలు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల ఇళ్లు కేటాయించి.. ఒక్కొ ఇంటికి రూ.1.70 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. ఆ నిధులను పక్కనపెట్టి డబుల్ బెడ్​రూమ్​ ఇళ్లు ఇస్తామని చెప్పిన తెరాస.. అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతున్న ఆరు ఇళ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

గ్రామాల్లో నిరుపేదలు ఇళ్లు నిర్మించుకుంటే సాయం చేయాల్సిన ప్రభుత్వం.. ఎల్​ఆర్​ఎస్ పేరిట డబ్బులు వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎల్​ఆర్​ఎస్​ పేరిట ఇప్పటి వరకు రూ.60 వేల కోట్లు వసూలు చేశారని.. ఇకనైనా తెరాస ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చట్టాన్ని రద్దు చేయాలన్నారు. ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేసే వరకూ తమ ఉద్యమాన్ని ఆపేది లేదని తెల్చిచెప్పారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం.. ఎల్​ఆర్​ఎస్​ పేరిట నిరుపేదల రక్తాన్ని పీల్చబోతుందని మెదక్​ జిల్లా భాజాపా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్​ ఆరోపించారు. ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలంటూ మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కమలం నేతలు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల ఇళ్లు కేటాయించి.. ఒక్కొ ఇంటికి రూ.1.70 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. ఆ నిధులను పక్కనపెట్టి డబుల్ బెడ్​రూమ్​ ఇళ్లు ఇస్తామని చెప్పిన తెరాస.. అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతున్న ఆరు ఇళ్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

గ్రామాల్లో నిరుపేదలు ఇళ్లు నిర్మించుకుంటే సాయం చేయాల్సిన ప్రభుత్వం.. ఎల్​ఆర్​ఎస్ పేరిట డబ్బులు వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎల్​ఆర్​ఎస్​ పేరిట ఇప్పటి వరకు రూ.60 వేల కోట్లు వసూలు చేశారని.. ఇకనైనా తెరాస ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చట్టాన్ని రద్దు చేయాలన్నారు. ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేసే వరకూ తమ ఉద్యమాన్ని ఆపేది లేదని తెల్చిచెప్పారు.

ఇవీ చూడండి: గోడు వినకుండా.. పొట్ట కొట్టారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.