మెదక్ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి.. వినియోగంలోకి తీసుకురావాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు. పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ సముదాయ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. రామాయంపేట మున్సిపాలిటీలో రెండు ఎకరాలలో అర్బన్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రామాయంపేటలో పర్యటించిన అదనపు కలెక్టర్.. పట్టు పరిశ్రమ స్థలంలో రెండు ఎకరాల్లో పట్టణ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్ను సందర్శించిన మంత్రి కేటీఆర్