భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయి 100వ జయంతి పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ మైదానంలో స్పేస్ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు.
ఇస్రో ఎన్ఆర్ఎస్సీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర ద్వారా అంతరిక్ష విశేషాలు వివరించారు. రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్ లాంచ్ షాట్స్, ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నమూనాలు ప్రదర్శించారు. రాకెట్లు ఆకాశంలో ఎలా దూసుకెళ్తాయో విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. విజ్ఞాన విశేషాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.