ETV Bharat / state

Singareni Trade unions strike: సింగరేణిలో మూడో రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె

Singareni Trade unions strike : సింగరేణిలోని ఆరు కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె మూడోరోజూ కొనసాగుతోంది. తమ డిమాండ్ల కోసం నిరసన తెలుపుతూ శనివారం స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. రాష్ట్రం కోసం కొట్లాడిన తాము.. హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు.

author img

By

Published : Dec 11, 2021, 9:03 AM IST

Updated : Dec 11, 2021, 9:32 AM IST

Singareni Trade unions strike, Singareni coal mines
సింగరేణి కార్మికుల సమ్మె

Singareni Trade unions strike : నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె.. ఆఖరి రోజైన మూడో రోజూ కొనసాగుతోంది. తమ డిమాండ్ల కోసం నిరసన తెలుపుతూ కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. రామగుండం రీజియన్‌లోని 6 భూగర్భ, 4 ఉపరితల గనుల్లో సమ్మె చేస్తున్నారు. కార్మికుల సమ్మెతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కార్మికుల సమ్మె కారణంగా బొగ్గు గనులు బోసిపోతున్నాయి. సమ్మెను విజయవంతం చేయాలంటూ కార్మిక సంఘాలు ర్యాలీ చేపట్టాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని గనులపై అత్యవసర విధులు నిర్వర్తించే కార్మికులను మాత్రమే విధులకు హాజరయ్యారని కార్మిక సంఘాలు, అధికారులు తెలిపారు. నాలుగు బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలని...12 ప్రధాన డిమాండ్లతో తెరాస అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఐదు జాతీయ కార్మిక సంఘాల ఐకాస ఇచ్చిన పిలుపుతో సింగరేణి వ్యాపించిన ఆరు జిల్లాలోని వివిధ విభాగాల కార్మికులు, అధికారులు సంపూర్ణ మద్దతు తెలుపుతూ సమ్మెలో పాల్గొంటున్నారు.

స్పందించిన యాజమాన్యం

Singareni coal privatization : సింగరేణి కార్మికులు చేపట్టిన రెండు రోజుల సమ్మె ప్రశాంతంగా ముగిసింది. సమ్మెలో భాగంగా రెండో రోజు ఎమ్మెల్యే, ఎంపీలు సంఘీభావం తెలిపారు. 72 గంటల సమ్మెలో సింగరేణి సంస్థకు దాదాపు 150 కోట్లు విలువ చేసే నాలుగు లక్షల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. సింగరేణి సంస్థ స్పందించింది. ఈ నెల 15, 16 తేదీల్లో కార్మిక సంఘాలను దిల్లీకి తీసుకెళ్లి అక్కడ కేంద్ర బొగ్గు శాఖ మంత్రితో పాటు... బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సమావేశం ఏర్పాటు చేస్తామని సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చింది.

పోరాటం ఆగదు..

మూడు రోజుల సమ్మెతో తమ పోరాటం ముగియలేదని... న్యాయమైన డిమాండ్లను పూర్తిగా పరిష్కారం చేసేంతవరకు మళ్లీ సమ్మెను నిరవధిక సమ్మెగా కొనసాగిస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులు చిన్నచూపు చూస్తుందని, కేంద్రం విధానాలతో కార్మికుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. రాష్ట్రం కోసం కొట్లాడిన తమకు... హక్కుల కోసం తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని అన్నారు. 12 ఏళ్ల తర్వాత కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి చేస్తున్న సమ్మె ఇది అని... సింగరేణి కార్మికుల పరిరక్షణ కోసం పోరాడుతామని పేర్కొన్నారు. బొగ్గు బ్లాకుల వేలం వేసే గుత్తేదారులను కార్మిక నాయకులు హెచ్చరించారు.

రెండో రోజు విజయవంతం

సింగరేణిలోని ఆరు కార్మిక సంఘాలు చేపట్టిన మూడు రోజుల సమ్మెలో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి ఏరియాలో రెండో రోజు విజయవంతమైంది. రెండు రోజుల నుంచి కార్మికవర్గం సమ్మెలో పాల్గొనడంతో ఏరియాలోని ఖైరిగూర, బీపీఏ ఓసీపీ, సీహెచ్‌పీతో పాటు పలు విభాగాలు బోసిపోయాయి. బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో సింగరేణి రహదారులు నిర్మానుష్యంగా మారాయి. క్వారీ నుంచి బొగ్గు పెళ్ల బయటకు రాకపోవడంతో డంపర్లు, డోజర్లు, షావెల్స్‌ ఎక్కడక్కడ నిలిచిపోయాయి. రోజుకు మూడు షిప్టులలో 1237 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, సమ్మె ప్రభావంతో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గురువారం ఒకరోజు సమ్మెతో రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. సీఐ సతీష్‌కుమార్‌, ఎస్‌ఐ భవానీసేన్‌బందోబస్తు నిర్వహించారు.

ఇదీ చదవండి: TRS leaders on singareni strike: 'బొగ్గు గనుల వేలంపై.. భాజపా ఎంపీలు పార్లమెంటులో మాట్లాడాలి'

Singareni Trade unions strike : నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె.. ఆఖరి రోజైన మూడో రోజూ కొనసాగుతోంది. తమ డిమాండ్ల కోసం నిరసన తెలుపుతూ కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. రామగుండం రీజియన్‌లోని 6 భూగర్భ, 4 ఉపరితల గనుల్లో సమ్మె చేస్తున్నారు. కార్మికుల సమ్మెతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కార్మికుల సమ్మె కారణంగా బొగ్గు గనులు బోసిపోతున్నాయి. సమ్మెను విజయవంతం చేయాలంటూ కార్మిక సంఘాలు ర్యాలీ చేపట్టాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని గనులపై అత్యవసర విధులు నిర్వర్తించే కార్మికులను మాత్రమే విధులకు హాజరయ్యారని కార్మిక సంఘాలు, అధికారులు తెలిపారు. నాలుగు బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలని...12 ప్రధాన డిమాండ్లతో తెరాస అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఐదు జాతీయ కార్మిక సంఘాల ఐకాస ఇచ్చిన పిలుపుతో సింగరేణి వ్యాపించిన ఆరు జిల్లాలోని వివిధ విభాగాల కార్మికులు, అధికారులు సంపూర్ణ మద్దతు తెలుపుతూ సమ్మెలో పాల్గొంటున్నారు.

స్పందించిన యాజమాన్యం

Singareni coal privatization : సింగరేణి కార్మికులు చేపట్టిన రెండు రోజుల సమ్మె ప్రశాంతంగా ముగిసింది. సమ్మెలో భాగంగా రెండో రోజు ఎమ్మెల్యే, ఎంపీలు సంఘీభావం తెలిపారు. 72 గంటల సమ్మెలో సింగరేణి సంస్థకు దాదాపు 150 కోట్లు విలువ చేసే నాలుగు లక్షల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. సింగరేణి సంస్థ స్పందించింది. ఈ నెల 15, 16 తేదీల్లో కార్మిక సంఘాలను దిల్లీకి తీసుకెళ్లి అక్కడ కేంద్ర బొగ్గు శాఖ మంత్రితో పాటు... బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సమావేశం ఏర్పాటు చేస్తామని సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చింది.

పోరాటం ఆగదు..

మూడు రోజుల సమ్మెతో తమ పోరాటం ముగియలేదని... న్యాయమైన డిమాండ్లను పూర్తిగా పరిష్కారం చేసేంతవరకు మళ్లీ సమ్మెను నిరవధిక సమ్మెగా కొనసాగిస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులు చిన్నచూపు చూస్తుందని, కేంద్రం విధానాలతో కార్మికుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. రాష్ట్రం కోసం కొట్లాడిన తమకు... హక్కుల కోసం తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని అన్నారు. 12 ఏళ్ల తర్వాత కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి చేస్తున్న సమ్మె ఇది అని... సింగరేణి కార్మికుల పరిరక్షణ కోసం పోరాడుతామని పేర్కొన్నారు. బొగ్గు బ్లాకుల వేలం వేసే గుత్తేదారులను కార్మిక నాయకులు హెచ్చరించారు.

రెండో రోజు విజయవంతం

సింగరేణిలోని ఆరు కార్మిక సంఘాలు చేపట్టిన మూడు రోజుల సమ్మెలో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి ఏరియాలో రెండో రోజు విజయవంతమైంది. రెండు రోజుల నుంచి కార్మికవర్గం సమ్మెలో పాల్గొనడంతో ఏరియాలోని ఖైరిగూర, బీపీఏ ఓసీపీ, సీహెచ్‌పీతో పాటు పలు విభాగాలు బోసిపోయాయి. బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో సింగరేణి రహదారులు నిర్మానుష్యంగా మారాయి. క్వారీ నుంచి బొగ్గు పెళ్ల బయటకు రాకపోవడంతో డంపర్లు, డోజర్లు, షావెల్స్‌ ఎక్కడక్కడ నిలిచిపోయాయి. రోజుకు మూడు షిప్టులలో 1237 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, సమ్మె ప్రభావంతో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గురువారం ఒకరోజు సమ్మెతో రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. సీఐ సతీష్‌కుమార్‌, ఎస్‌ఐ భవానీసేన్‌బందోబస్తు నిర్వహించారు.

ఇదీ చదవండి: TRS leaders on singareni strike: 'బొగ్గు గనుల వేలంపై.. భాజపా ఎంపీలు పార్లమెంటులో మాట్లాడాలి'

Last Updated : Dec 11, 2021, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.