ETV Bharat / state

ఓ వైపు గణనాథుడు... మరోవైపు పీర్లు... మత సామరస్యం అంటే ఇదే... - Religious harmony

మతాలు వేరైనా తామంతా మనుషులమే... భగవంతుని రూపాలు వేరైనా తమ భక్తి భావం ఒక్కటే అని నిరూపించారు మంచిర్యాల జిల్లా వెంకటాపూర్​ గ్రామస్థులు. మన మతాన్ని పూజిద్దాం.. పర మతాన్ని గౌరవిద్దాం అన్న పెద్దల మాటలకు జీవం పోశారు. పక్కపక్కనే గణపతి విగ్రహం, పీర్లు ప్రతిష్ఠించి తమ భక్తితో పాటు... మత సామరస్యాన్ని చాటుకున్నారు.

ఓ వైపు గణనాథుడు... మరోవైపు పీరులు... మత సామరస్యం అంటే ఇదే...
author img

By

Published : Sep 10, 2019, 1:29 AM IST

రూపాలు వేరైనా భగవంతున్ని చేరుకునే మార్గమే భక్తి. ప్రతి ఒక్కరిలోనూ దేవుడున్నాడని నమ్మే మనిషి ఆ నమ్మకానికి ఓ రూపమిచ్చి.. భగవంతుని స్వరూపంగా భావించి చేసుకునే వేడుకలే పండుగలు. తాము పూజించే దేవుడి రూపాలు వేరైనా.. ఆచరించే మతాలు వేరైనా సోదరభావంతో కలిసిపోయి వేడుకలు నిర్వహించుకుంటున్నారు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్​ వాసులు.

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు ఈ గ్రామస్థులు. ఒకే మాసంలో వచ్చిన గణపతి నవరాత్రులు, మొహర్రం పండుగలను కలిపి జరుపుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతే కాదు పక్కపక్కనే వినాయక ప్రతిమ, పీర్లు ప్రతిష్ఠించి మతసామరస్యాన్ని చాటుకుంటున్నారు. పీర్ల పండగాలో భాగంగా ఏర్పాటు చేసిన అగ్ని గుండం చుట్టూ గ్రామస్థులంతా నృత్యాలు చేస్తుంటారు. ఆ సమయంలో వినాయకుడి వద్ద ఉన్న స్పీకర్లు ఆపేస్తారు. మతం ఏదైనా తామంతా మనుషులమే అంటూ సోదరభావంతో కలిసి మెలిసి పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు గ్రామస్థులు.

ఓ వైపు గణనాథుడు... మరోవైపు పీరులు... మత సామరస్యం అంటే ఇదే...

ఇవీచూడండి: 1984 అల్లర్లు: కమల్​నాథ్​ను వీడని చిక్కులు!

రూపాలు వేరైనా భగవంతున్ని చేరుకునే మార్గమే భక్తి. ప్రతి ఒక్కరిలోనూ దేవుడున్నాడని నమ్మే మనిషి ఆ నమ్మకానికి ఓ రూపమిచ్చి.. భగవంతుని స్వరూపంగా భావించి చేసుకునే వేడుకలే పండుగలు. తాము పూజించే దేవుడి రూపాలు వేరైనా.. ఆచరించే మతాలు వేరైనా సోదరభావంతో కలిసిపోయి వేడుకలు నిర్వహించుకుంటున్నారు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్​ వాసులు.

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు ఈ గ్రామస్థులు. ఒకే మాసంలో వచ్చిన గణపతి నవరాత్రులు, మొహర్రం పండుగలను కలిపి జరుపుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతే కాదు పక్కపక్కనే వినాయక ప్రతిమ, పీర్లు ప్రతిష్ఠించి మతసామరస్యాన్ని చాటుకుంటున్నారు. పీర్ల పండగాలో భాగంగా ఏర్పాటు చేసిన అగ్ని గుండం చుట్టూ గ్రామస్థులంతా నృత్యాలు చేస్తుంటారు. ఆ సమయంలో వినాయకుడి వద్ద ఉన్న స్పీకర్లు ఆపేస్తారు. మతం ఏదైనా తామంతా మనుషులమే అంటూ సోదరభావంతో కలిసి మెలిసి పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు గ్రామస్థులు.

ఓ వైపు గణనాథుడు... మరోవైపు పీరులు... మత సామరస్యం అంటే ఇదే...

ఇవీచూడండి: 1984 అల్లర్లు: కమల్​నాథ్​ను వీడని చిక్కులు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.