ETV Bharat / state

ప్రతిఒక్కరూ రెండు మొక్కలైనా నాటాలి..  సంరక్షించాలి: మంత్రి కొప్పుల - harithaharam program in manchiryal

మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం ముదిగుంటలో నిర్వహించిన హరితహారం కార్యక్రమాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్​ ప్రారంభించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 20 హెక్టార్​లో ఏర్పాటు చేసిన హరితవనంలో మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు రెండు మొక్కలైనా నాటాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

minster koppula eeshwar started harithahaaram program
ప్రతీ ఒక్కరు రెండు మొక్కలైనా నాటాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్​
author img

By

Published : Jun 25, 2020, 3:58 PM IST

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంటలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అటవీశాఖ ఆధ్వర్యంలో 20 హెక్టార్​లో ఏర్పాటు చేసిన హరితవనంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా పరిషత్ ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్​, జిల్లా కలెక్టర్ భారతి హోలికేరీ, రామగుండం సీపీ సత్యనారాయణ హాజరై మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలైన నాటి సంరక్షించాలని మంత్రి సూచించారు.

ఇవీ చూడండి: రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంటలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అటవీశాఖ ఆధ్వర్యంలో 20 హెక్టార్​లో ఏర్పాటు చేసిన హరితవనంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా పరిషత్ ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్​, జిల్లా కలెక్టర్ భారతి హోలికేరీ, రామగుండం సీపీ సత్యనారాయణ హాజరై మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలైన నాటి సంరక్షించాలని మంత్రి సూచించారు.

ఇవీ చూడండి: రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.