ETV Bharat / state

'డెంగీ' తాండవం: ఒకే కుటుంబంలో నలుగురు మృతి

author img

By

Published : Oct 30, 2019, 6:32 PM IST

Updated : Oct 30, 2019, 10:46 PM IST

'డెంగీ' మనిషిని వణికిస్తోంది. దవాఖాన రోగులతో నిండిపోయింది. ఎప్పుడు ఏ ఇంటి నుంచి మరణవార్త వినిపిస్తుందోననే భయం ప్రజల్లో నెలకొంది. ఇటీవలే న్యాయమూర్తి మృతివార్త మరువకముందే... ఒకే ఇంట్లో నలుగురిని డెంగీ కబళించడం కలచివేస్తోంది. మంచిర్యాలలోని శ్రీనగర్‌ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది.

డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి
డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

పదిహేను రోజుల క్రితమే భర్త మృతిచెందాడు. తొమ్మిదిరోజుల క్రితం తాతయ్య మృత్యు ఒడికి చేరాడు. నాలుగురోజుల క్రితం కూతురు మరణించింది. వరుస మరణాలతో వణికిపోయిన ఆ కుటుంబంలో మరో విషాదం జరిగింది. ఇవాళే ఆ ఇంటి కోడలు సైతం అనంతలోకాలకు వెళ్లిపోయింది.

పక్షం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ‘డెంగీ’కి బలయ్యారు. మంచిర్యాల శ్రీశ్రీనగర్‌కు చెందిన సోని డెంగీకి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. సోని 9నెలల గర్భవతికాగా మంగళవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. డెంగీ వ్యాధితో సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం కన్నుమూసింది. ఇటీవలే భర్త, కుమార్తె, తాతను డెంగీతో కోల్పోయింది. ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

తల్లిలేదు.. తండ్రిరాడు...

విషాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ కుటుంబంలో మరో ఘటన చోటుచేసుకుంది. నిన్ననే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. వరుసగా భర్త, తాతయ్య, కూతురు మరణించడంతో బాధలో ఉన్న ఆ తల్లికి కొడుకు కాస్త ఊరటని భావించారందరు! కానీ అంతలోనే ఆ దేవుడికి కన్ను కుట్టింది. ఆ పసివాడికి తల్లిని దూరం చేశాడు

ఒకరి తర్వాత ఒకరుగా...

మంచిర్యాల శ్రీశ్రీనగర్‌కు చెందిన గుడిమల్ల రాజగట్టు (30) ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా డెంగీతో బాధపడుతున్న ఆయన స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 16న మృతిచెందారు. మృతుడి ఐదో రోజు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈ నెల 20న రాజగట్టు తాత లింగయ్య (70) డెంగీ కారణంగా మరణించారు. ఆ బాధ నుంచి తేరుకుంటుండగానే రాజగట్టు కుమార్తె శ్రీ వర్షిణి (6) 4 రోజుల క్రితం డెంగీ బారినపడింది. దీపావళి రోజే చిన్నారి అసువులు బాయడంతో ఆ కుటుంబం తల్లడిల్లింది. ఒకే కుటుంబంలో డెంగీతో నలుగురు చనిపోవడంతో మంచిర్యాల ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రాష్ట్రంలో ఒక్కొక్కరు డెంగీతో పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇవీచూడండి: ఆ ఇంటిని పట్టుకున్న డెంగీ భూతం

డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

పదిహేను రోజుల క్రితమే భర్త మృతిచెందాడు. తొమ్మిదిరోజుల క్రితం తాతయ్య మృత్యు ఒడికి చేరాడు. నాలుగురోజుల క్రితం కూతురు మరణించింది. వరుస మరణాలతో వణికిపోయిన ఆ కుటుంబంలో మరో విషాదం జరిగింది. ఇవాళే ఆ ఇంటి కోడలు సైతం అనంతలోకాలకు వెళ్లిపోయింది.

పక్షం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ‘డెంగీ’కి బలయ్యారు. మంచిర్యాల శ్రీశ్రీనగర్‌కు చెందిన సోని డెంగీకి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. సోని 9నెలల గర్భవతికాగా మంగళవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. డెంగీ వ్యాధితో సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం కన్నుమూసింది. ఇటీవలే భర్త, కుమార్తె, తాతను డెంగీతో కోల్పోయింది. ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

తల్లిలేదు.. తండ్రిరాడు...

విషాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ కుటుంబంలో మరో ఘటన చోటుచేసుకుంది. నిన్ననే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. వరుసగా భర్త, తాతయ్య, కూతురు మరణించడంతో బాధలో ఉన్న ఆ తల్లికి కొడుకు కాస్త ఊరటని భావించారందరు! కానీ అంతలోనే ఆ దేవుడికి కన్ను కుట్టింది. ఆ పసివాడికి తల్లిని దూరం చేశాడు

ఒకరి తర్వాత ఒకరుగా...

మంచిర్యాల శ్రీశ్రీనగర్‌కు చెందిన గుడిమల్ల రాజగట్టు (30) ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా డెంగీతో బాధపడుతున్న ఆయన స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 16న మృతిచెందారు. మృతుడి ఐదో రోజు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈ నెల 20న రాజగట్టు తాత లింగయ్య (70) డెంగీ కారణంగా మరణించారు. ఆ బాధ నుంచి తేరుకుంటుండగానే రాజగట్టు కుమార్తె శ్రీ వర్షిణి (6) 4 రోజుల క్రితం డెంగీ బారినపడింది. దీపావళి రోజే చిన్నారి అసువులు బాయడంతో ఆ కుటుంబం తల్లడిల్లింది. ఒకే కుటుంబంలో డెంగీతో నలుగురు చనిపోవడంతో మంచిర్యాల ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రాష్ట్రంలో ఒక్కొక్కరు డెంగీతో పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇవీచూడండి: ఆ ఇంటిని పట్టుకున్న డెంగీ భూతం

Intro:సికింద్రాబాద్

యాంకర్: పక్షం రోజుల్లో డెంగ్యూ తో తాత, భర్త, కుమార్తెతో పాటు తను కూడా డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ తనువు చాలించిన ఘటన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో జరిగింది.

తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల లో ఒకే కుటుంభానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయిన సంఘటన మరువకముందే మరో కుటుంబ సభ్యురాలు కూడా చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి, ఒకే కుటుంబంలో నలుగురు డెంగ్యూ వ్యాధి బారిన పడి మరణించిన ఘటన అందరిని కలచివేసింది, మంచిర్యాల టౌన్ శ్రీశ్రీ నగర్ కు చెందిన ఈద సోనా(29) అనే వివాహిత డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. చనిపోయిన సోనా నిన్న మద్యాహ్నం మగశిశువుకు జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు, గత నాలుగు రోజుల క్రితం దీపావళి రోజున సోనా కూతురు ఐదేళ్ల చిన్నారి శ్రీ వైష్ణవి కూడా డెంగ్యూ తో మరణించడం వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది, సోనా భర్త రాజ గట్టు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ డెంగ్యూ బారినపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గత పదిహేను రోజుల క్రితమే చనిపోయాడు. మృతుడి 5వ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా రాజ గట్టు తాత లింగయ్య కూడా డెంగ్యూ తో మరణించాడు. సోనా 9 నెలల గర్భవతి ఆమె మూడు రోజులుగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది, నిన్న మగ పిల్లోడికి జన్మ నిచ్చిన సోనా ఈరోజు మధ్యహ్నం చనిపోయింది. ఇప్పటికే భర్త, తాత మరియు కుమార్తెను పోగొట్టుకున్న సోనా కూడ మృతి చెందింది, ఒకే కుటుంబంలో డెంగ్యూతో నలుగురు చనిపోవడంతో మంచిర్యాల ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. రాష్ట్రంలో ఒక్కొక్కరు డెంగ్యూ వ్యాధితో పిట్టల్లా రాలిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


బైట్: శ్రీహిత,
మృతురాలి సోదరిBody:VamshiConclusion:7032401099
Last Updated : Oct 30, 2019, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.