కరీంనగర్కు చెందిన శ్రీకాంత్ ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో మెకానికల్ ఇంజినీర్. అదే గ్రామంలో బంధువులకు సంబంధించిన రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇంజనీర్ శ్రీకాంత్ బండారం బయటపడింది.
అంతా బానే ఉంది అనుకుంటున్న సమయంలో దొంగిలించిన ద్విచక్ర వాహనంపై జరిమానా పడినట్లు యజమానికి తెలిసింది. అప్రమత్తమైన వాహన యజమాని పోలీసులకు సమాచారం అందించగా... మంచిర్యాల పోలీసులు శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారించినట్లు డీసీపీ రక్షితా కృష్ణామూర్తి తెలిపారు. నిందితుడు నేరాన్ని అంగీకరించగా... అతని వద్ద నుంచి 32 కిలోల బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: నడుస్తుంటే.. భూమి ఒక్కసారిగా కుంగిపోయింది