మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ను పురస్కరించుకొని దుస్తులను పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సతీమణి జయతార హాజరయ్యారు. క్రైస్తవులకు దుస్తులు అందజేశారు తహసీల్దార్ కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ త్రియంబకేశ్వర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఫోను పక్కనుంటే.. పలకరింపే కరువాయే!