ETV Bharat / state

కల్వర్టును ఢీకొట్టిన బస్సు..ఐదుగురి పరిస్థితి విషమం

కల్వర్టును ఢీకొట్టి ఆర్టీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

author img

By

Published : May 17, 2019, 5:19 PM IST

కల్వర్టును ఢీకొట్టిన బస్సు..తప్పిన పెను ప్రమాదం

మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టి పక్కకు ఒరిగిపోయింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం ఏమీ జరగలేదు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా... 15 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలపాలయ్యారు. బస్సు డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది.

చెన్నూరు నుంచి మంచిర్యాల వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తు బస్సు ఓ వైపు ఒరిగిందని.. ఒకవేళ బోల్తా పడి ఉంటే ఘోరం జరిగిపోయేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

కల్వర్టును ఢీకొట్టిన బస్సు..తప్పిన పెను ప్రమాదం

ఇవీ చూడండి: రాష్ట్ర ఆవతరణ వేడుకల ఏర్పాట్లపై సీఎం సమీక్ష

మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టి పక్కకు ఒరిగిపోయింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం ఏమీ జరగలేదు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా... 15 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలపాలయ్యారు. బస్సు డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది.

చెన్నూరు నుంచి మంచిర్యాల వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తు బస్సు ఓ వైపు ఒరిగిందని.. ఒకవేళ బోల్తా పడి ఉంటే ఘోరం జరిగిపోయేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

కల్వర్టును ఢీకొట్టిన బస్సు..తప్పిన పెను ప్రమాదం

ఇవీ చూడండి: రాష్ట్ర ఆవతరణ వేడుకల ఏర్పాట్లపై సీఎం సమీక్ష

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.