మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం, తాండూరు మండలంలో భాజపా నాయకులు ఆందోళన చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. తాండూరు మండల కేంద్రంలో నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రదర్శన చేపట్టారు. అనంతరం బెల్లంపల్లి రాష్ట్రీయ రహదారిపై భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి: దోమకొండలో ముగ్గురి దారుణ హత్య