ETV Bharat / state

గుండు తీర్పు ఇచ్చిన  పెద్దల అరెస్టు

మహబూబ్​నగర్​ జిల్లా ముచ్చింతల గ్రామంలో గేదెను అపహరించి విక్రయించారని ఇద్దరు యువకులకు గుండు గీయించిన గ్రామ పెద్దల్లో  9 మందిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

author img

By

Published : May 18, 2019, 5:40 PM IST

గుండు తీర్పు ఇచ్చిన  పెద్దల అరెస్టు
గుండు తీర్పు ఇచ్చిన పెద్దల అరెస్టు

మహబూబ్​నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో గేదెలు విక్రయించారనే నేరారోపణ చేసి పంచాయతీ పెద్దల సమక్షంలో ఇద్దరు యువకులకు గుండు గీయించారు. ఈ సంఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. పంచాయతీ తీర్పు చెప్పిన మాజీ సర్పంచ్ హర్షవర్ధన్ రెడ్డి, జానకిరాములు , వెంకటేశ్వర్ రెడ్డి, విష్ణువర్ధన్​రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి , భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డితోపాటు గుండు గీసిన నాయిబ్రాహ్మణుడు బాలకృష్ణను కోర్టులో హాజరుపర్చారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: ఆత్మహత్యాయత్నానికి దారితీసిన గుండు తీర్పు

గుండు తీర్పు ఇచ్చిన పెద్దల అరెస్టు

మహబూబ్​నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో గేదెలు విక్రయించారనే నేరారోపణ చేసి పంచాయతీ పెద్దల సమక్షంలో ఇద్దరు యువకులకు గుండు గీయించారు. ఈ సంఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. పంచాయతీ తీర్పు చెప్పిన మాజీ సర్పంచ్ హర్షవర్ధన్ రెడ్డి, జానకిరాములు , వెంకటేశ్వర్ రెడ్డి, విష్ణువర్ధన్​రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి , భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డితోపాటు గుండు గీసిన నాయిబ్రాహ్మణుడు బాలకృష్ణను కోర్టులో హాజరుపర్చారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: ఆత్మహత్యాయత్నానికి దారితీసిన గుండు తీర్పు

Intro:Tg_Mbnr_06_18_Theerpu_ nindhilthulu_Arrest_Av_G3
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో లో గేదెలు విక్రయించారనే నేరారోపణ చేసి పంచాయతీ పెద్దల సమక్షంలో ఇద్దరు యువకులకు గుండు గీయించిన సంఘటన లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి ఆత్మకూర్ కోర్టులో హాజరు పరిచారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు


Body:మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి తన సొంత గేదె తో పాటు దూడను తల్లిదండ్రులకు తెలియకుండా స్నేహితుని సాయంతో విక్రయించిన సంగతి విధితమే. విషయం తెలిసిన తల్లిదండ్రులు విక్రయించిన గేదెను తిరిగి తీసుకువచ్చి పంచాయతీ పెట్టించారు. పంచాయతీ తీర్పు మేరకు దొంగతనానికి పాల్పడిన మహేశ్వర్ రెడ్డి ని, సహకరించిన స్నేహితుడు రాఘవేందర్ కు గుండు గియించాలని గ్రామ పెద్దలు తీర్పును ఇచ్చి అమలు చేశారు. స్నేహితుడు అడిగినందుకు సాయం చేశాను తప్ప తాను ఎలాంటి తప్పు చేయలేదని తీవ్ర మనోవేదనకు గురైన రాఘవేంద్ర suicide notes రాసి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన సంఘటనతో విషయం బయటకు పొక్కి పోలీసులకు ఫిర్యాదు అందింది. తీర్పు సమయంలో పాల్గొన్న
11 మందిలో లో తొమ్మిది మందిని అరెస్టు చేసి ఆత్మకూరు కోర్టుల్లో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు
కోర్టులో హాజరువారిలో మాజీ సర్పంచ్ హర్షవర్ధన్ రెడ్డి, janaki రాములు , వెంకటేశ్వర్ రెడ్డి విష్ణువర్ధన్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,వెంకట్ రెడ్డి , భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పంచాయతీ తీర్పు మేరకు గుండు గీసిన నాయిబ్రాహ్మణుడు బాలకృష్ణ తదితరులున్నారు

నోట్ : సర్ ఫోటో వీడియోస్ వాట్సాప్ లో ఈటివి భారత్ డెస్క్ నెంబర్ కు పంపిస్తాను పరిశీలించగలరు


Conclusion:గేదెలను అపహరించి విక్రయించారనే నేరము తో గుండు గీయించిన గ్రామ పెద్ద లో 11 మందికి గాను 9 మందిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.