ETV Bharat / state

'నిబంధనలు పాటిస్తూ.. పునః ప్రారంభించండి'

author img

By

Published : Mar 27, 2021, 3:25 PM IST

మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. విద్యాసంస్థలను పుఃనప్రారంభించాలని డిమాండ్‌ చేశాయి.

student unions protest
విద్యార్థి సంఘాల ధర్నా

విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ.. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా విద్యాసంస్థలను ప్రారంభించి.. ఎన్నికలు ముగియగానే మూసివేసిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు తెరవాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఇప్పుడు మూసి వేయడంతో విద్యార్థులు తీవ్ర నష్టపోతున్నారని వాపోయారు. కళాశాలలు తెరిచిన కొంత కాలంలోనే విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి 75 శాతం ఫీజులు వసూలు చేశాయన్నారు.

ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నా అవి అంత ప్రయోజనకరంగా లేవని వివరించారు. కోవిడ్‌ నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపడుతూ.. వెంటనే పాఠశాలలు, కళాశాలలను పునః ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం విద్యాశాఖాధికారికి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి: ఎస్బీఐ చోరీ కేసులో దర్యాప్తు వేగవంతం

విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ.. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా విద్యాసంస్థలను ప్రారంభించి.. ఎన్నికలు ముగియగానే మూసివేసిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు తెరవాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఇప్పుడు మూసి వేయడంతో విద్యార్థులు తీవ్ర నష్టపోతున్నారని వాపోయారు. కళాశాలలు తెరిచిన కొంత కాలంలోనే విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి 75 శాతం ఫీజులు వసూలు చేశాయన్నారు.

ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నా అవి అంత ప్రయోజనకరంగా లేవని వివరించారు. కోవిడ్‌ నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపడుతూ.. వెంటనే పాఠశాలలు, కళాశాలలను పునః ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం విద్యాశాఖాధికారికి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి: ఎస్బీఐ చోరీ కేసులో దర్యాప్తు వేగవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.